Jagan Movie: జగన్ అంటేనే టక్కున అందరికీ ఏపీ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారు. అయితే జగన్ పేరు మీదగా ఓ సినిమా కూడా ఉందండోయ్.. ఈ సినిమా గురించి చాలా మందికి తెలియదు. అప్పట్లో శోభన్ బాబు హీరోగా ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను సందడి చేసింది. మరి ఆ సినిమా విశేషాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను సందడి చేశాయి. ఈ క్రమంలోనే 1972లో వచ్చిన మానవుడు దానవుడు అనే సినిమాలో శోభన్ బాబు హీరోగా నటించారు. ఇందులో శోభన్ బాబు జగన్ అనే పాత్రలో నటించారు. ఇక ఈ పాత్ర అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో చాలామంది తమ పిల్లలకు జగన్ అనే పేరు కూడా పెట్టారు.
ఇక జగన్ పాత్రకు వచ్చిన ప్రేక్షకాదరణ దృష్టిలో ఉంచుకొని దాసరి నారాయణరావు రాజకీయాల నేపథ్యంలో ఓ సినిమాని ప్లాన్ చేశారు. ప్రస్తుతం, మాజీ ముఖ్యమంత్రుల మధ్య డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి జగన్ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత సెన్సార్ వెళ్ళినప్పుడు సినిమాకు అభ్యంతరం వచ్చింది. ఇందులో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పలు సన్నివేశాలు ఉండటం చేత సెన్సార్ సభ్యుల నుంచి అభ్యంతరాలు వెలువడ్డాయి. అయితే దాసరి సినిమాలకు ఇలాంటి అభ్యంతరాలు రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే దాసరి రివిజన్ కోసం ప్రింట్ ముంబైకు వెళ్ళింది. అక్కడ పలు సమస్యలు ఎదురైనా, అనంతరం ఈ సినిమా అనుకున్న తేదీ కన్నా మరికొద్ది రోజులు విడుదలకు వాయిదా పడింది. అలా ఈ సినిమా 1984 మార్చి 10 వ తేదీ విడుదల అయింది. ఇలా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించలేకపోయినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా విడుదల సమయంలో శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రభావం శోభన్ బాబు జగన్ సినిమాపై పడింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…