Jeevitha Rajasekhar:టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరగాళ్లు కూడా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు వరకు ఎంతో సునాయసంగా మోసపోతు లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి జీవిత రాజశేఖర్ కు ఒక ఫోన్ కాల్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యారు. తన పేరు ఫారుక్ అని పరిచయం చేసుకొని మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది తానేనట్టు పరిచయం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా జియో సేవలలో 50 శాతం డిస్కౌంట్ పేరుతో ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కొని చేసే ఆఫర్ ఉందని చెప్పారు. అయితే జీవిత ఏదో పనిలో ఉండి ఈ విషయాలన్నీ తన మేనేజర్ తో మాట్లాడాలని సూచించారు. ఈ క్రమంలోనే అటువైపు నుంచి ఆ వ్యక్తి జియో ఆఫర్ పేరిట రెండున్నర లక్ష రూపాయలు విలువ చేసే వస్తువులను ఆఫర్ ధరలో మీరు 1.25 లక్షల రూపాయలకే కొనుగోలు చేయవచ్చు అంటూ చెప్పారు.
ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఆఫర్లు రావడంతో జీవిత మేనేజర్ సదరు వ్యక్తి అకౌంట్ కు 1.25లక్షల రూపాయలు నగదును ట్రాన్స్ఫర్ చేశారు.ఇలా డబ్బు పంపిన తర్వాత అవతలి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో తాను మోసపోయానని గ్రహించిన జీవిత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి పోలీసులకు జరిగిన విషయం మొత్తం తెలియజేశారు.
ఈ క్రమంలోనే పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ జరపగా ఆ వ్యక్తి ఫారుక్ కాదని గుర్తించారు.జియో ఆఫర్ పేరిట జీవిత రాజశేఖర్ దంపతులకు కుచ్చుటోపి పెట్టిన వ్యక్తి చెన్నైకి చెందిన నరేష్ అని పోలీసులు గుర్తించడమే కాకుండా తనని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎంతోమంది ప్రతి రోజు సైబర్ నేరగాళ్ల మాయలో పడి పెద్ద ఎత్తున డబ్బును మోసపోతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…