ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా 800 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

ఈ మధ్య కాలంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ప్రైవేట్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. అమర్ రాజా గ్రూప్ కంపెనీలో 800 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు.

అమర్ రాజా కంపెనీ ఈ నోటిఫికేషన్ ద్వారా 800 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,500 రూపాయలు వేతనంగా లభిస్తుంది. కంపెనీ ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, వసతి, ఇతర సదుపాయాలను ఉద్యోగాలకు ఎంపికైన వారికి కల్పిస్తారు. https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం అభ్యర్థులు అమర్ రాజా సంస్థలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే జనవరి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పది ఇంటర్ పాస్ అయినవారితో పాటు ఫెయిల్ అయిన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు డిప్లొమో, డిగ్రీ, బీటెక్ చదువులు మధ్యలో ఆపేసిన వారు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేపటి వరకు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.