Jr NTR: మేనత్త కుటుంబాన్ని పరామర్శించిన ఎన్టీఆర్ దంపతులు.. వైరల్ అవుతున్న ఫోటోలు?

ఈ క్రమంలోనే ఈమె మరణ వార్త తెలియగానే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆమె నివాసం వద్దకు చేరుకొని ఆమె అంత్యక్రియల వరకు అక్కడే ఉండి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇకపోతే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈమె అంత్యక్రియలలో పాల్గొన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇండియాలో లేని కారణంగా ఆమె చివరి చూపుకు నోచుకోలేదు.

ఇక తన భార్య పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లిన ఎన్టీఆర్ తన అత్త మరణ వార్త తెలియగానే ఇండియాకు బయలుదేరారు. అయితే ఈయన ఇండియా చేరుకునే సమయానికి మరి కాస్త ఆలస్యం కావడంతో అప్పటికే అంతక్రియలు పూర్తి అయ్యాయి. ఇండియా తిరిగి వచ్చిన ఎన్టీఆర్ వెంటనే తన భార్య లక్ష్మీ ప్రణతి తన తల్లి శాలిని, అన్న కళ్యాణ్ రామ్ కలిసి ఉమామహేశ్వరి ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కంఠమనేని ఉమామహేశ్వరి మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే పోస్టుమార్టం నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించడమే కాకుండా ఆమె రెండు కళ్ళను కూడా దానం చేశారు. ఉమామహేశ్వరి మరణానికి మానసిక ఒత్తిడే అసలు కారణమా మరి ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.