K. Viswanath: గత కొన్ని రోజుల నుండి సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, జమున, వాణిజయరామ్ ఇలా వరుస మరణాలు చోటు చేసుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగింది. ఈ ఘటనలు మరువకముందే కళాతపస్వి విశ్వనాధ్ మరణించిన సంగతి ఇండస్ట్రీ మరింత కన్నీటి శోకంలో మునిగింది.
ఈయనతో ఒక శకం ముగిసింది. ఈయన మరణంతో సినీ ఇండస్ట్రీ పెద్దదిక్కుని కోల్పోయినట్లుగా మిగిలింది. ఇక ఈయన మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మరువలేకపోతున్నారు. ఇక ఈయనతో కలిసి పని చేసిన నటీనటులు కూడా ఇప్పటికీ ఆయనను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.
తాజాగా సినిమాలో నటించిన ఒకప్పటి నటి సబితా ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన గురించి తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తను ఆ మధ్య కెనడా వెళ్తూ ఆయనను కలిసి వెళ్లాను అని.. తిరిగి వచ్చాక కూడా కలిశాను అని తెలిపింది. ఇక ఇంతకాలం ఎక్కడికి వెళ్లావు అని ఆయన అడగడంతో.. మీకు చెప్పి వెళ్లాను కదా గురువుగారు అని అనటంతో తనకు గుర్తుకులేదు అని అన్నాడట.
ఇక ఆయనతో గతం లో మాట్లాడిన విషయాల గురించి తెలిపింది. ఇక తనకు సప్తపది సినిమాలో అవకాశం ఇచ్చారని.. ఆ సమయంలో తను భయపడితే ధైర్యం ఇచ్చాడని తెలిపింది. ఆ సినిమా చేయటం తన అదృష్టమని తెలిపింది. ఇక ఆయనను చూసేందుకు ఎప్పుడైనా వెళ్తే.. ఈ సినిమాలోని డాన్స్ మరోసారి చేయించుకునేవారు అని.. కానీ ఇప్పుడు ఆయనను చూడలేను అంటూ ఎమోషనల్ అయింది. ఇక ఆయన గురించి మరికొన్ని విషయాలు పంచుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…