Chiranjeevi: కోలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న లోకనాయకుడు, లెజండరీ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత నాలుగు సంవత్సరాల నుంచి పలు కారణాల వల్ల కమల్ హాసన్ వెండితెరకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అభిమానులు కమల్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు.ఈ క్రమంలోనే గత నాలుగు సంవత్సరాల నుంచి అభిమానులలో ఉన్న వెలితిని విక్రమ్ సినిమా ద్వారా భర్తీ చేశారు.
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ 3వ తేదీ పలు భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు కానీ మేము ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలలో నటించామని ఈ సందర్భంగా కమల్ హాసన్ వెల్లడించారు. నేను మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా పలు పాన్ ఇండియా సినిమాలలో నటించారు.తెలుగు సినిమాని తెలుగు హీరోలను తమిళ ప్రేక్షకులు ఆదరించే వారు కాదని అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం ఉండేది.అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.
చిరంజీవినీ ఎక్కువగా మెచ్చిన తెలుగు ఆడియన్స్ కి ఎక్కువగా కమిట్ అవ్వడం వల్ల ఆయన తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళంలో సినిమాలను చేయాలనుకోవడం లేదు. ఇలా మెగాస్టార్ చిరంజీవి తమిళంలో సినిమాలు చేయకపోవడమే ఆయన చేసిన చిన్న తప్పు లేదంటే మెగాస్టార్ చిరంజీవిని కూడా తమిళంలో అమితంగా ఇష్టపడే వారు ఉన్నారు అంటూ కమల్ హాసన్ మెగాస్టార్ చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…