Chiranjeevi: కోలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న లోకనాయకుడు, లెజండరీ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత నాలుగు సంవత్సరాల నుంచి పలు కారణాల వల్ల కమల్ హాసన్ వెండితెరకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అభిమానులు కమల్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు.ఈ క్రమంలోనే గత నాలుగు సంవత్సరాల నుంచి అభిమానులలో ఉన్న వెలితిని విక్రమ్ సినిమా ద్వారా భర్తీ చేశారు.
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ 3వ తేదీ పలు భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు కానీ మేము ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలలో నటించామని ఈ సందర్భంగా కమల్ హాసన్ వెల్లడించారు. నేను మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా పలు పాన్ ఇండియా సినిమాలలో నటించారు.తెలుగు సినిమాని తెలుగు హీరోలను తమిళ ప్రేక్షకులు ఆదరించే వారు కాదని అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం ఉండేది.అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.
చిరంజీవినీ ఎక్కువగా మెచ్చిన తెలుగు ఆడియన్స్ కి ఎక్కువగా కమిట్ అవ్వడం వల్ల ఆయన తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళంలో సినిమాలను చేయాలనుకోవడం లేదు. ఇలా మెగాస్టార్ చిరంజీవి తమిళంలో సినిమాలు చేయకపోవడమే ఆయన చేసిన చిన్న తప్పు లేదంటే మెగాస్టార్ చిరంజీవిని కూడా తమిళంలో అమితంగా ఇష్టపడే వారు ఉన్నారు అంటూ కమల్ హాసన్ మెగాస్టార్ చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…