Kantara Actor Kishore: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నటువంటి వాటిలో కేజిఎఫ్ సిరీస్, కాంతార సినిమాలు ఒకటని చెప్పాలి.ఈ రెండు సినిమాల్లో కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇకపోతే ఈ రెండు సినిమాలను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ హోం బలే ఫిలింస్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే.
ఇక కే జి ఎఫ్ 2 సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక
కాంతార సినిమా కూడా కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి సుమారు 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి చరిత్ర సృష్టించిందని చెప్పాలి.ఇక కే జి ఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా హీరో యశ్ కు విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.
ఇక ఈ సినిమాపై ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా కాంతర సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నటుడు కిషోర్ తాజాగా కాంతారావు సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నటుడు కిషోర్ మాట్లాడుతూ తనకు కే జి ఎఫ్ అంటే సినిమాలు ఏమాత్రం నచ్చవని అందుకే ఆ సినిమాని తాను చూడకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు.
కే జి ఎఫ్ తో పాటు కాంతార సినిమాని కూడా నిర్మించినది హోంభలే నిర్మాణ సంస్థ అయిన తాను కేజిఎఫ్ బ్రాండ్ కథ కథనాలకు అభిమానిని కాదని తెలిపారు. కే జి ఎఫ్ సినిమా ఒక చెత్త సినిమా..ఇలాంటి ఒక మైండ్ లెస్ సినిమాల కన్నా తీవ్రమైన సమస్యలతో తెరకెక్కి చిన్న కంటెంట్ ఆధారిత సినిమాలకే తాను మద్దతు ఇస్తానని ఈయన కే జి ఎఫ్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం నటుడు కిషోర్ కాంతార సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…