Kantara Actor Kishore: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నటువంటి వాటిలో కేజిఎఫ్ సిరీస్, కాంతార సినిమాలు ఒకటని చెప్పాలి.ఈ రెండు సినిమాల్లో కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇకపోతే ఈ రెండు సినిమాలను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ హోం బలే ఫిలింస్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే.
ఇక కే జి ఎఫ్ 2 సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక
కాంతార సినిమా కూడా కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి సుమారు 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి చరిత్ర సృష్టించిందని చెప్పాలి.ఇక కే జి ఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా హీరో యశ్ కు విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.
ఇక ఈ సినిమాపై ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా కాంతర సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నటుడు కిషోర్ తాజాగా కాంతారావు సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నటుడు కిషోర్ మాట్లాడుతూ తనకు కే జి ఎఫ్ అంటే సినిమాలు ఏమాత్రం నచ్చవని అందుకే ఆ సినిమాని తాను చూడకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు.
కే జి ఎఫ్ తో పాటు కాంతార సినిమాని కూడా నిర్మించినది హోంభలే నిర్మాణ సంస్థ అయిన తాను కేజిఎఫ్ బ్రాండ్ కథ కథనాలకు అభిమానిని కాదని తెలిపారు. కే జి ఎఫ్ సినిమా ఒక చెత్త సినిమా..ఇలాంటి ఒక మైండ్ లెస్ సినిమాల కన్నా తీవ్రమైన సమస్యలతో తెరకెక్కి చిన్న కంటెంట్ ఆధారిత సినిమాలకే తాను మద్దతు ఇస్తానని ఈయన కే జి ఎఫ్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం నటుడు కిషోర్ కాంతార సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…