Kanthara Daughter Susila : జానపద సినిమాలో కత్తి యుద్ధాలు చేసే హీరో అనగానే గుర్తొచ్చే హీరో కాంతారావు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతరావు. అయన నాటకాలల్లో ప్రసిద్ధి చెంది ఆ తరువాత సినిమాల వైపు వచ్చారు. అనేక జానపద, సాంఘిక చిత్రాలలో నటించిన ఆయన దాదాపు 100 సినిమాలలో హీరోగా నటించారు. ఇక మిగిలిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే విలన్ గాను నటించారు. ముఖ్యంగా నారద పాత్రలో బాగా ఫేమస్ కాంతారావు గారు. ఎన్టీఆర్ తో సమానంగా పౌరాణిక జానపదాలలో నటించిన అయన అప్పటి సమకాలిన నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక చెన్నై లో స్థిరపడి ఆస్తులను కూడా సంపాదించిన కాంతారావు గారు చివరి రోజుల్లో మాత్రం సొంత ఇల్లు కూడా లేకుండా చనిపోయారు. ఇక ఆయన వారసులుగా ఆయన పిల్లలు కానీ మనవళ్లు కానీ ఎందుకు సినిమా ఇండస్ట్రీలో లేరు అనే విషయం పై ఆయన కూతురు సుశీల గారు క్లారిటీ ఇచ్చారు.
దాసరి మోహన్ బాబు గొడవ వల్ల నా కొడుకు సినిమాలో లేడు…
కాంతారావు గారు ఎన్నో వేల సినిమాలను చేసినా కొడుకులు సినిమాల్లోకి రాలేదు. అందరూ ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారు. అయితే కాంతారావు గారు కూతురు సుశీల గారి అబ్బాయి ని సినిమాల్లో నటింపజేయాలని బాగా అనుకున్నారు. అలా దాసరి గారి డైరెక్షన్ లో మోహన్ బాబు తో వచ్చిన సినిమా ‘కొండవీటి సింహాసనం’ సినిమాలో అవకాశం కోసం ప్రయత్నించిగా అందులో కోట శ్రీనివాసరావు గారి కాంబినేషన్ లో సీన్స్ ఉన్నాయి.
షూటింగ్ అంతా అయ్యాక దాసరి గారికి కోటా శ్రీనివాసరావు గారికో లేక దాసరి గారికి మోహన్ బాబు గారికో సరిగా గుర్తులేదు కానీ ఆ గొడవల వల్ల కోటా గారి సీన్స్ మొత్తం సినిమాలో తొలగించారు. అలా మా అబ్బాయి సీన్స్ కూడా సినిమాలో లేకుండా పోయాయి. ఇక ఆ తరువాత సినిమాల మీద ఆసక్తి లేక నటించలేదు అంటూ ఆ సంఘటన గురించి చెప్పారు సుశీల.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…