పోలీసులంటే చట్టాన్ని గౌరవిస్తూ న్యాయాన్ని కాపాడాల్సిన ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నవారిగా భావిస్తారు. కానీ చాలా మంది తమ వృత్తికి అన్యాయం చేస్తూ అన్యాయానికి మద్దతుగా నిలబడుతున్నారు. పోలీసులు అడ్డగోలుగా సంపాదిస్తూ అవినీతికి తెరలేపుతున్నారు. ఇటువంటి అవినీతి పోలీసులపై అవినీతి నిరోధక శాఖ కొరడా జరిపిస్తుంది. గత పది రోజుల నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులు మూడు ఏసీబీ కేసులను నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పోలీసులకు లంచం ఇవ్వకపోతే ఒక్క పని కూడా జరగదు. ఈ క్రమంలోనే బాధితులను టార్గెట్ చేసుకొని పోలీసులు వేళ్ళకు వేళ్ళు లంచాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటున్న అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కేవలం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ విధంగా పోలీసులు సిబ్బంది అడ్డగోలుగా సంపాదిస్తున్నారని ఆరోపించారు.
గత పది రోజుల క్రితం జగిత్యాలలో రెండు ఏసీబీ కేసులు నమోదై ఇద్దరు ఎస్ఐ లతో పాటు ఒక రైటర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఒక ఏఎస్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికారు. ఈవిధంగా బాధితుల నుంచి అధిక మొత్తంలో లంచాలు తీసుకోవడంతో బాధితులు ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ వారికి తెలియజేశారు.
ఈ సమాచారం అందుకున్న ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో అధికారులు , సిబ్బంది రంగంలోకి దిగి పోలీసుల పై తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పృథ్విధర్ గౌడ్ , రైటర్ రమేశ్ లు ఇసుక ట్రాక్టర్ను వదిలివేసేందుకు రూ .10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విధంగా పది రోజులలో ఇంత మంది పోలీసుల పై కేసులు నమోదు కావడంతో ఖాకీలు చేస్తున్నటువంటి లంచగొండి తనానికి ఇది నిదర్శనమని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ విధమైనటువంటి అవినీతికి అడ్డుకట్ట వేయాలని అధికారులు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…