స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. గత ఎపిసోడ్ లో భాగంగా మోనితను కార్తీక్ చంపాడని ఏసిపి రోషిని దీప ఇంటికి వెళ్లి కార్తీక్ ను మోనితను శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అంటూ నిలదీస్తుంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్ నేడు 1115 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి నేటి ఎపిసోడ్ లో హైలెట్స్ ఏమిటో తెలుసుకుందాం.. ఏసిపి రోషిని కార్తీక్ ఇంటికి వెళ్లి మోనిత శవాన్ని ఎక్కడ దాచారో చెప్పు కార్తీక్ అంటూ నిలదీయగా.. అందుకు దీప ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు.. మోనిత ఏంటి శవం ఏంటి అని అడగడంతో ఈ పుణ్యమూర్తి మీకు ఏమీ చెప్పలేదా.. అంటూ అని అడుగుతుంది. లేదు మేడం అనగా కార్తీక్ మోనితను గన్ తో షూట్ చేసే చంపేశాడు. అని చెప్పడంతో దీప షాక్ అవుతుంది. మా ఆయన ఇలా చేశారు అంటే మీరు నమ్ముతున్నారా.. నువ్వు నమ్మలేదా … అని అనడంతో మా ఆయన హత్య చేశారు అంటే నా మనసాక్షి నమ్మలేదు మేడం అయితే కోర్టు కొచ్చి సాక్ష్యం చెప్పమను నీ మనస్సాక్షిని అని రోషిని అంటుంది.దీప ఈ ప్రపంచంలో అందరూ నీలాగే పుణ్య మూర్తులు ఉండరు అని రోషిని దీపతో చెబుతుంది
ఈ క్రమంలోనే మోనితను చంపాననడానికి సాక్ష్యం ఏంటి అని అడగగా.. కానిస్టేబుల్స్ భాగ్యాన్ని లోపలికి తీసుకు వస్తారు.మేడం డాక్టర్ బాబు కారు డిక్కీలో రక్తపు మరకలు ఉన్నాయి అని చెబుతారు. అదేవిధంగా భాగ్యం రావడంతో భాగ్యం జరిగినది మొత్తం చెప్పు అంటూ రోషిని అంటుంది. ఈ క్రమంలోనే అక్కడ జరిగిన విషయాన్ని భాగ్యం చెబుతుంది. కేవలం నేను మాటలు మాత్రమే విన్నాను ఎవరు చంపినది చూడలేదు మేడం అంటూ భాగ్యం చెబుతుంది. ఎన్నిసార్లు షూట్ చేసినట్టు వినిపించింది అని రెండుసార్లు మేడం అంటూ భాగ్యం సమాధానం చెబుతుంది. అదేవిధంగా కార్తీక్ మోనిత సౌందర్య రివాల్వర్ తో షూట్ చేశాడు. మోనిత ఇంట్లో దొరికిన బుల్లెట్ ఇది. ఇది మీ మమ్మీ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఇంకొకటి మోనిత బాడీలో ఉందంటూ బుల్లెట్ ను సాక్ష్యం చూపిస్తుంది.
ఇంతలోనే ఆదిత్య ఆనందరావు అక్కడికి వస్తారు. ఏం జరిగిందో నేను కంగారుగా లోపలికి వెళితే అక్కడ పోలీసులు ఉండటం చూసి జరిగిన విషయాన్ని మొత్తం తెలుసుకుంటారు. ఓకే మేడం నేను మా లాయర్ తో మాట్లాడి కార్తీక్ ను సరెండర్ చేస్తానని ఆనందరావు చెప్పగా.. సారీ సర్ ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్పి కార్తీక్ ని తీసుకురమ్మని అక్కడి నుంచి వెళ్తుంది. ఈ క్రమంలోనే కార్తీక్ దీప వైపు చూస్తూ నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీకు కష్టాలు తప్పడం లేదు.. మోనిత కడుపుకు నేను ఎలా కారణమయ్యానో.. తన చావుకు కూడా అలాగే కారణం అయ్యాను మరోసారి మోసపోయాను దీప అంటూ బాధపడతాడు. దీప పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో.. మీరందరూ కలిసి నాన్న దగ్గరికి వెళ్లిపోండి.. నాన్న మీరు ఆరోగ్యం జాగ్రత్త టైం కి మందులు వేసుకోండి అని చెబుతాడు.
పోలీసులు కార్తీక్ ని తీసుకు వెళ్తుండగా భాగ్యం కార్తీక్ కాళ్ళపై పడి తప్పు చేశాను నన్ను క్షమించండి అల్లుడు గారు. పోలీసులకు నేనే మిమ్మల్ని పట్టించాను అంటూ క్షమాపణ కోరుతుంది. లేవండి అంటూ భాగ్యాన్ని లేపి దీపను జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతాడు. ఇంతలో గా పిల్లలు అక్కడికి రావడంతో పోలీసులు కార్తీక్ ను అరెస్టు చేసేది చూసి వెళ్లి గట్టిగా కార్తీక్ ను హత్తుకుని ఏడుస్తారు. అది చూసిన ఏసిపి రోషిని ఆవేశంలో అతను చంపేటప్పుడు తన పిల్లలు గుర్తు రాలేదా అని మనసులో అనుకుంటుంది. ఈ క్రమంలోనే దీప పిల్లలని తీసుకోగా పోలీసులు కార్తీక్ ను వెంటబెట్టుకుని వెళ్తారు. పిల్లలు తమ డాడీ కోసం ఏడుస్తూ ఉంటారు. జైల్లో కూర్చుని కార్తీక్ మౌనిక చేసిన మోసాలను గుర్తుచేసుకుంటూ బాధపడతాడు.ఇంతటితో ఎపిసోడ్ పూర్తికాగా తర్వాత ఎపిసోడ్ లో సౌందర్య వచ్చిమోనిత ని చంపింది తనేనని తనని అరెస్ట్ చేయాలని కోరుతోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…