Keerthi suresh Mother: సాధారణంగా ప్రేక్షకులకు ఏదైనా పాట నచ్చితే దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఎన్నో పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇలా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పాటలలో ” చంకీల అంగీలేసి ఓ వదినే” అనే పాట కూడా ఒకటి . ఇక్కడ చూసినా కూడా ఈ పాటే వినిపిస్తోంది. హీరో నాని, కీర్తీ సురేష్ జంటగా నటించిన దసరా సినిమాలోని ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
చిన్న , పెద్ద అని తేడా లేకుండా అందరూ ఈ పాటకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ పాటలు స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ తల్లి, అలనాటి నటి మేనక కూడా ఈ పాటకు చిందులు వేసింది. చంకీల అంగీలేసి అంటూ కూతురి పాటకు అద్భుతమైన డాన్స్ చేసింది. ఈ డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా తమిళ్ వర్శన్ లో ఈ పాటకు తన కుమార్తె భర్త తో కలిసి మేనక స్టెప్పులు వేసింది.
దసరా ఫీవర్ అంటూ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఈ పాటకు తన కూతురితో కలిసి స్టెప్పులు వేసింది. ఈ సందర్భంగా దసరా సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో డాన్స్ వీడియో ని షేర్ చేసింది. నాని , కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
దసరా శోభను తెచ్చిన నాని…
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరా సినిమా ఇటీవల విడుదలై మరొకసారి ప్రేక్షకులకు దసరా శోభని తీసుకువచ్చింది. మార్చి 30 వ తేదీ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నాని ఇద్దరు పోటీపడి నటించినట్లుగా ఉంది. ఈ సినిమాతో నాని పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…