Shaakuntalam: ప్రముఖ దర్శకుడు గుశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం శాకుంతలం. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులను చిత్ర బృందం వేగవంతం చేసింది.
ఈ ప్రమోషన్ పనులలో భాగంగా ఇప్పటికే సమంత పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది. తాజాగా ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనే సినిమా గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గుణశేఖర్ మాట్లాడుతూ..” శాకుంతలం సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి మూడు సంవత్సరాల సమయం పట్టిందని తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆరు నెలలు సమయం అనుకున్నాము. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తి కావటానికి 81 రోజుల సమయం పట్టింది.
ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏడాదిన్నర సమయం పట్టింది. మొత్తానికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి మూడు సంవత్సరాలు కాలం పట్టింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమాలో శకుంతల పాత్ర కోసం మొదట సమంతని ఎన్నుకొలేదని తెలిపాడు. శాకుంతలం సినిమా తీయాలనుకున్నపుడు శకుంతల పాత్ర కోసం సమంతని అనుకోలేదు. కానీ ఆ పాత్రకి సమంత సరిగ్గా సరిపోతుందని నా కూతురు సమంత పేరుని సూచించింది అంటూ చెప్పుకొచ్చాడు.
రంగస్థలం సినిమా చూసాకే…
ఈ సినిమాలో పాత్ర కోసం సమంతని సంప్రదించడానికి ముందు ఆమె నటించిన రంగస్థలం సినిమా చూశా. ఆ సినిమా చూసిన తర్వాత సినిమా కోసం సమంత తన పాత్రలో ఎంతగాలీనమైందో అర్థం అయింది. ఆ సినిమా చూసిన తర్వాతనే ఆమె ఏ పాత్రలో అయినా లీనమైపోతుందని భావించి శకుంతల పాత్ర కోసం ఆమెను సంప్రదించాను అంటూ గుణశేఖర్ చెప్పుకొచ్చాడు.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…