MLA Mekapati Chandhrashekhar Reddy : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని తాజాగా జరిగిన ఎమ్మెల్సి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డాడు అనే ఆరోపణల మీద వైసీపీ పార్టీ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇక ఈ విషయాల గురించి అలాగే ఆయన టీడీపీ నుండి పదికోట్ల డబ్బు తీసుకుని మరీ క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డాడు అనే ఆరోపణల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.
పది కోట్లకు బెంగళూరులో షాపింగ్ కాంప్లెక్స్…
మేకపాటి గారి రెండో ఫ్యామిలీ సంగతి బయటికి రావడం, అటు గౌతమ్ రెడ్డి గారి మరణం తరువాత నెల్లూరు రాజకీయాలు మారిపోయాయి. వచ్చే ఎన్నికలలో మేకపాటికి వ్యతిరేకత ఉందని గెలిచే అవకాశం లేదని జగన్ గారి వద్ద రిపోర్ట్స్ ఉండటంతో ఆయనకు టికెట్ ఇవ్వనని, ఎమ్మెల్సి ఇస్తానని, టికెట్ వేరేవాళ్లకు ఇస్తున్నట్లు మేకపాటిని పిలిచి జగన్ చెప్పారట. మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా మేకపాటి అడిగినా అది జరగలేదు.
ఈ సారి ఉదయగిరి టికెట్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డికి ఇస్తున్నట్లు చెప్పి అతనకి సహకరించాలని అదేశించడంతో మేకపాటి అసంతృప్తితో ఉండగా టీడీపీ నుండి కడప జిల్లా నేత బిటెక్ రవి ద్వారా పది కోట్లు ఆయనకు ఇచ్చి ఎమ్మెల్సి ఎన్నికలలో టీడీపీ అభ్యర్తికి ఓటు వేసే విధంగా చేసారని ఆరోపణల నడుమ ఆ పది కోట్లకు బెంగళూరులో షాపింగ్ కాంప్లెక్స్ కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మాట్లాడుతూ మేకపాటి అలాంటిదేమి లేదని తాను టీడీపీతో పది కోట్లు తీసుకున్నది నిరూపించండి అంటూ ఛాలెంజ్ చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…