Kiara Advani: మహేష్ బాబు కొరటాల కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కియారా అద్వానీ.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించారు.ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి కియారా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కానున్నారనే వార్తలు బి టౌన్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నటువంటి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని పరోక్షంగా వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ జంట డిసెంబర్ నెలలో చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా అండ్ రిసార్ట్స్ లో ఎంతో ఘనంగా చేసుకోనున్నట్లు సమాచారం. ఇక ఈ వివాహానికి కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ముందుగా వీరు వివాహాన్ని గోవాలో సిద్ధార్థ మల్హోత్రా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం జరపాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వీరి వివాహాన్ని చండీగడ్ కి మార్చినట్టు వెల్లడించారు.
ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఇలా వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు. ఇక కీయారా సినిమాల విషయానికి వస్తే ఈమె రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…