Samantha-Naga Chaitanya: ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సమంత. నాగచైతన్య సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా ఈ సినిమాతో ప్రేమలో పడిన నాగచైతన్య సమంత కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న అనంతరం పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇలా వీరి వివాహం జరిగిన తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఈ దంపతులు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా సమంత వరుస హిట్ సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుందనుకుంటున్న క్రమంలో వీరిద్దరూ అభిమానులకు పిడుగు లాంటి వార్త చెప్పారు.
ఇద్దరి మధ్య పలు మనస్పర్ధలు రావడం చేత వీరు తీసుకొని విడిపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ విడాకుల గురించి ప్రకటించారు. ఇలా విడాకుల తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన అనారోగ్య సమస్య గురించి తెలియజేయడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈమె అనారోగ్యంపై స్పందిస్తూ తను త్వరగా కోలుకోవాలని సానుభూతి ప్రకటిస్తున్నారు.
ఇకపోతే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సమంతకు ఇలాంటి వ్యాధి ఉందని తెలిసి ముందుగానే నాగచైతన్యతో విడాకులు తీసుకొని విడిపోయారని అదేవిధంగా సమంత నాగచైతన్యతో మాట్లాడుతూ తనని మరొక పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి సమంత నిజంగానే నాగచైతన్యకు ఇలాంటి సలహా ఇచ్చిందో లేదో తెలియదు కానీ ఈమె ఇచ్చిన సలహా పట్ల చైతన్య అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…