Samantha-Naga Chaitanya: ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సమంత. నాగచైతన్య సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా ఈ సినిమాతో ప్రేమలో పడిన నాగచైతన్య సమంత కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న అనంతరం పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా వీరి వివాహం జరిగిన తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఈ దంపతులు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా సమంత వరుస హిట్ సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుందనుకుంటున్న క్రమంలో వీరిద్దరూ అభిమానులకు పిడుగు లాంటి వార్త చెప్పారు.
ఇద్దరి మధ్య పలు మనస్పర్ధలు రావడం చేత వీరు తీసుకొని విడిపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ విడాకుల గురించి ప్రకటించారు. ఇలా విడాకుల తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన అనారోగ్య సమస్య గురించి తెలియజేయడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈమె అనారోగ్యంపై స్పందిస్తూ తను త్వరగా కోలుకోవాలని సానుభూతి ప్రకటిస్తున్నారు.

Samantha-Naga Chaitanya: సమంతకు ముందుగానే ఈ సమస్య ఉందని తెలుసా…
ఇకపోతే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సమంతకు ఇలాంటి వ్యాధి ఉందని తెలిసి ముందుగానే నాగచైతన్యతో విడాకులు తీసుకొని విడిపోయారని అదేవిధంగా సమంత నాగచైతన్యతో మాట్లాడుతూ తనని మరొక పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి సమంత నిజంగానే నాగచైతన్యకు ఇలాంటి సలహా ఇచ్చిందో లేదో తెలియదు కానీ ఈమె ఇచ్చిన సలహా పట్ల చైతన్య అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.































