Krishna Death: నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా కృష్ణ మరణ వార్త ఎంతో మంది అభిమానులను కలచి వేసింది. ఇకపోతే కృష్ణ చనిపోవడానికి ముందు రోజు ఏం జరిగింది తనతో ఎలాంటి విషయాలు మాట్లాడారనే విషయాలు గురించి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు పలు విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ కృష్ణ గారికి గుండెపోటు వచ్చే ముందు ఆదివారం ఉదయం నేను తన వద్దకు వెళ్లానని తెలిపారు. అప్పుడు అంతా కూడా అన్నయ్య తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. ఇద్దరం కలిసి సైకిల్ పై సినిమాలకు వెళ్లే వాళ్ళమని ఇలా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నింటిని గుర్తు చేసుకొని బాగా నవ్వుకున్నారు.
ఆ సమయంలో అన్నయ్యకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య ఉన్నట్టు అనిపించలేదు. ఇక తనని అక్కడే భోంచేసి వెళ్ళమని చెప్పగా తన ఇంటికి ఇతరులు భోజనానికి వస్తున్నారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మరోసారి వస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళా. ఆరోజు అర్ధరాత్రి 12:30 గంటలకు అన్నయ్య దగ్గర ఉన్నటువంటి ఒక అబ్బాయి తన గదిలో నుంచి గురక శబ్దం రాలేదని గమనించి వెళ్లి పల్స్ చెక్ చేశారు. ఏదో తేడాగా ఉండడంతో వెంటనే నాకు ఫోన్ చేశారు.
గుండెపోటు ప్రభావం ఇతర భాగాలపై పడింది..
తనని వెంటనే హాస్పిటల్ కి తీసుకు రమ్మని చెప్పి నేను కూడా అక్కడికి వెళ్లాను అయితే అప్పటికే అతనికి గుండెపోటు వచ్చి దాదాపు 30 నిమిషాలు కావడంతో ఆ ప్రభావం శరీరంలోని ఇతర భాగాలపై అలాగే రక్తప్రసరణ వ్యవస్థ పై పడటంతో అతని అవయవాలు కూడా పూర్తిగా పనిచేయకుండా పోయాయని డాక్టర్లు సుమారు 30 గంటల పాటు కష్టపడినప్పటికీ ఫలితం లేదంటూ ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు కృష్ణ చనిపోవడానికి ముందు జరిగిన విషయాలన్నింటినీ బయట పెట్టారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…