Kukka Padma: సినిమా ప్రపంచం పైకి కనిపించినంత అందంగా లోపల ఉండదు. అందులోనూ ఎంతోమంది పేరు తెచ్చుకుని పైకి వచ్చినా లోపలున్న కుళ్ళు రాజకీయాలకు బలైపోతారు. అలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుసగా సినిమాలు అందుకుని ఆపైన హీరోలకు చెల్లిగా కూడా రాణించిన నటి పద్మ గారు కూడా అలాంటి రాజకీయాలకే బలై సినిమా అవకాశాలు లేక ప్రస్తుతం కుటుంబ సభ్యుల మరణంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కొంతమంది అవకాశాలు రానివ్వలేదు…
కుక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పద్మ గారు, ఆ సినిమాతోనే కుక్క పద్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ సినిమా తరువాత వరుసగా ఎనిమిది సినిమాల్లో హీరోయిన్ గా ఆంధ్ర కేసరి, విముక్తి వంటి సినిమాల్లో నటించారు. ఇక మొండి ఘటం సినిమాలో చిరంజీవి కి చెల్లిగా నటించారు కుక్క పద్మ. అయితే వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలో ఒక రచయిత తనని రెండో వివాహం చేసుకోవాల్సిందిగా అడగటం తిరస్కరించడంతో ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడట. ఆమెకు అవకాశాలు రాకుండా చేసి ఇండస్ట్రీ నుండి బయటకు వెళ్లిపోయేలా చేసాడు అంటూ పద్మ గారు ఎమోషనల్ అయ్యారు.
1986 వరకూ సినిమాల్లో బాగా నటించిన తాను ఆపైన సినిమాల్లో కనిపించలేదని తెలిపారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, ఇక ఆయన సంపాదనతోనే గడిచేది. నాకూ సినిమాల్లో పెద్దగా ఏమి వచ్చేది కాదు అంటూ చెప్పారు. ఇక సినిమాల్లో అవకాశాలు రావని అర్థమయ్యాక తన తండ్రి వివాహం చేయగా భర్తకు అప్పటికే పెళ్ళై పిల్లలున్నారు. విషయం తెలిసాక విడాకులు తీసుకున్నాను. అనాటి నుండి ఒంటరిగా హైదరాబాద్ లోనే ఉంటున్నా. ఇప్పటికీ సినిమాల్లో నటించడానికి కానీ డబ్బింగ్ చెప్పడానికి కానీ అవకాశాలు రానివ్వకుండా ఆ వ్యక్తి చేస్తున్నాడు అంటూ తిండికి కూడా కష్టమైందంటూ బాధపడ్డారు.
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…