కొంతమంది ఇళ్లల్లో ఎలుకలు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. వాటి వల్ల ఇబ్బంది పడే వారు కొందరు ఉంటే.. వాటిని కొన్ని ప్రయోగాలకు ఉపయోగించే వారు కూడా ఉన్నారు. వైద్య రంగంలో వాటిపై ప్రయోగాలు చేస్తుంటారు. ఎలుకలకు తినే వస్తువు ఏదైనా కనిపిస్తే వాటిని వదిలిపెట్టవు.
తాజాగా ఇక్కడ ఆ ఎలుకలు చేసిన పనికి దాదాపు 2 వేల మంది ఇంటర్ నెట్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్ లోని టోరిడ్జ్, డేవాన్ ప్రాంతాలలో ఎలుకల బెడద కాస్త ఎక్కువే అని చెప్పాలి. అక్కడ అవి ఇంటర్ నెట్ కేబుళ్లను కొరికి పడేశాయి.
ఎక్కడ ఆ వైర్లు తెగి పడ్డాయో తెలియకుండా చేసేశాయి. దీంతో ఆ ప్రాంతంలోని మొత్తం దాదాపు 2 వేల మంది వైఫై సేవలను వినియోగించుకోలేక పోయారు. ఇలా అక్కడ బీటీ, ప్లస్నెట్,స్కై, వొడాఫోన్ సేవలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దాదాపు ఏడు గంటల పాటు ఇలా వైఫై సేవలకు అంతరాయం కలిగింది.
దీనిపై స్థానికంగా ఓ ప్రభుత్వ అధికారి స్పందించారు. ఫిర్యాదు వచ్చిన దగ్గర నుంచి తమ ఇంజనీర్లు ఎక్కువగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. మునుపటి స్థితికి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపాడు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…