పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరను మరోసారి పెంచేశాయి. దీంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందనే చెప్పవచ్చు. ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు మళ్లీ రూ.25 పెరిగింది. ధరల పెంపు సెప్టెంబర్ 1 నుంచే అమలులోకి వస్తుంది.
గ్యాస్ సిలిండర్ ధర పెరగడం 15 రోజుల్లోనే ఇది రెండో సారి కావడం గమనార్హం. సిలిండర్ ధర పెంపు నేపథ్యంలో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర ఇప్పుడు రూ.884కు చేరింది. హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.937 కి చేరుకుంది. దాదాపు గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 కి చేరువలోకి వస్తోంది. ఇదిలా ఉండగా.. సబ్సిడీ కింద ప్రతీ సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లను ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఆ డబ్బులు మొదట చెల్లించిన తర్వాత గ్యాస్ ఎవరి పేరుపై ఉందో వాళ్ల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రిడిట్ అవుతాయి. అయితే కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఆ డబ్బులు అనేవి క్రెడిట్ కాంకుడా ఉంటాయి. వాళ్లు మొట్టమొదటి సారిగా చేయాల్సిన పని ఏంటంటే.. ఆధార్ కార్డును తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసి ఉండాలి.
ఆ ఆధార్ నంబర్ ను ఎల్పీజీ ఐడీకి కూడా లింక్ చేయాలి. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా సబ్సిడీ రాకపోవచ్చు. ఒక వేళ రెండు నుంచి మూడు దఫాల వరకు సబ్సిడీ రానట్లయితే పైన చెప్పిన విధంగా చేస్తే.. అన్ని నెలలకు ఒకే సారి సబ్సిడీ క్రెడిట్ అవుతుంది. సబ్సిడీ వచ్చింది.. రానిది తెలుసుకోవాలంటే.. http://www.mylpg.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నా.. సబ్సిడీ రాకపోతే టోల్ ఫ్రీ నెంబర్ 18002333555 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…