M.M Keeravani: ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో వివిధ రంగాలలో అద్భుతమైన సేవలను కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మా పురస్కారాలను అందిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విశిష్టమైన సేవలు అందించిన 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు.
ఇందులో ఆరుగురు పద్మవిభూషణ్ అవార్డు అందుకోగా, 9 మందికి పద్మభూషణ్, 91 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేశారు.ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీకి ఎంతో సేవలు చేసినటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారు.
కీరవాణి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకోగా తాజాగా ఈ సినిమా కీర్తి కిరీటంలోకి మరొక అవార్డు వచ్చి చేరింది.ఈ సినిమా సంగీత దర్శకుడిగా అద్భుతమైన బాణీలు సమకూర్చిన ఎం ఎం కీరవానికి పద్మశ్రీ పురస్కారం లభించింది.
ఇక ఈ సినిమాలో నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడమే కాకుండా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచింది ఇలా తాజాగా మరోసారి ఈ పాటకు సంగీతం అందించిన కీరవానికి పద్మశ్రీ పురస్కారం రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనసు మమత చిత్రంతో తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన కీరవాణి ఇప్పటివరకు11 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఇందులో 8 ఉత్తమ సంగీత దర్శకుడిగా అందుకోగా మూడు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా అవార్డులు అందుకున్నారు.తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోగా ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. త్వరలోనే ఈయన ఆస్కార్ అవార్డును కూడా అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…