M.M Keeravani: ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో వివిధ రంగాలలో అద్భుతమైన సేవలను కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మా పురస్కారాలను అందిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విశిష్టమైన సేవలు అందించిన 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు.
ఇందులో ఆరుగురు పద్మవిభూషణ్ అవార్డు అందుకోగా, 9 మందికి పద్మభూషణ్, 91 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేశారు.ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీకి ఎంతో సేవలు చేసినటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారు.
కీరవాణి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకోగా తాజాగా ఈ సినిమా కీర్తి కిరీటంలోకి మరొక అవార్డు వచ్చి చేరింది.ఈ సినిమా సంగీత దర్శకుడిగా అద్భుతమైన బాణీలు సమకూర్చిన ఎం ఎం కీరవానికి పద్మశ్రీ పురస్కారం లభించింది.
ఇక ఈ సినిమాలో నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడమే కాకుండా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచింది ఇలా తాజాగా మరోసారి ఈ పాటకు సంగీతం అందించిన కీరవానికి పద్మశ్రీ పురస్కారం రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనసు మమత చిత్రంతో తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన కీరవాణి ఇప్పటివరకు11 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఇందులో 8 ఉత్తమ సంగీత దర్శకుడిగా అందుకోగా మూడు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా అవార్డులు అందుకున్నారు.తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోగా ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. త్వరలోనే ఈయన ఆస్కార్ అవార్డును కూడా అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…
మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…
ఆహారంలో రంగు, వాసన కోసం మాత్రమే ఉపయోగించే కుంకుమపువ్వు నిజానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు.…