Featured

M.S. Vikram : నేను హీరో అవ్వను అని చెప్పినా వినలేదు… మా నాన్న ఎంత మొండివాడంటే మొదటి సినిమాకే గుండు కొట్టించాడు : ఎంఎస్ విక్రమ్

M.S. Vikram : తెలుగులో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు ఎంఎస్ నారాయణ. ఆయన నటించిన అనేక సినిమాల్లో పండించిన హాస్యానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 750 సినిమాల్లో నటించిన ఎంఎస్ గారు ‘పెద్ధరాయుడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన కొడుకు విక్రమ్ నారాయణ కూడా సినిమాల మీద ఆసక్తితో సినిమాల్లోకి వచ్చి చేసిన మొదటి సినిమా ‘కొడుకు’. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు. ఇక తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమ గురించి అలాగే తనకు సినిమాల మీద ఉన్న ఆసక్తి గురించి మాట్లాడారు.

మా నాన్న మొండివాడు.. హీరో అవ్వను అని ఎంతచెప్పినా వినలేదు…

హీరోగా కొడుకు సినిమా ద్వారా వచ్చిన విక్రమ్ మొదట హీరోగా సినిమా చేయాలని అనుకోలేదని చెప్పారు. కేవలం తన తండ్రి మొండి పట్టుదలవల్ల హీరోగా చేశానని చెప్పారు. మొదట ఎంఎస్ నారాయణ గారి డైరెక్షన్ లో కొడుకు హీరోగా సినిమా తీశారు. అయితే ఆ సినిమాలో హీరోగా చేయనని విక్రమ్ ఎంత చెప్పినా వినలేదట. కానీ ఎంఎస్ గారు నాకు నా కొడుకును హీరోగా చూడాలనుకుంటున్నాను అని చెప్పి తీశారట. ఇక మొదటి సినిమాకే గుండు కూడా కొట్టించారు. మొదటిసారికే ఎవరైన అలా చేస్తారా కానీ ఆయన మొండి పట్టుదల అలా చేయించారు అంటూ విక్రమ్ చెప్పారు.

అయితే విక్రమ్ కి మాత్రం మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలని అనుకునేవారట కానీ హీరోగా సినిమా చేయడంతో ఆ అవకాశాలు పోయాయని చెప్పారు. కానీ మా నాన్న కోరిక నెరవేర్చాను ఆది చాలు అనిపిస్తుంది అంటూ చెప్పారు. ఇండస్ట్రీలో ఉండాలంటే లక్ ఫ్యాక్టర్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీ బిజినెస్ అంతా ఈరోజు ఎవరు మార్కెట్ లో ఉంటారో రేపు ఎవరు ఉంటారో ఎవరికీ తెలియదు అంటూ విక్రమ్ ఆయన అభిప్రాయాలను చెప్పారు.

Bhargavi

Recent Posts

తిరుమలలో కొత్త అనుభవం.. భక్తులకు వీఆర్ ద్వారా శ్రీవారి దర్శనం!

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో, క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండే సమయం కూడా ఎక్కువవుతోంది.…

9 minutes ago

“ఆర్టిస్టులు నేరస్తులా?”.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఫైర్

సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్‌పై నటి రేణు దేశాయ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర…

13 minutes ago

ఆలయ దర్శనంతో సందడి చేసిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో భక్తి వాతావరణం నెలకొంది. గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో తాజాగా నిర్మించిన కాశి విశ్వేశ్వరాలయం…

22 minutes ago

పెరుగు మంచిదా? మజ్జిగ మంచిదా? నిపుణుల క్లారిటీ

వేసవి కాలం మొదలైతే మన శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలపై అందరి దృష్టి పడుతుంది. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ అనే…

43 minutes ago

“మా రాజధాని అమరావతి”.. గర్వంగా చెప్పే రోజు వచ్చిందన్న బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కీలక పరిణామాల మధ్య నటుడు, ప్రజాప్రతినిధి నందమూరి బాలకృష్ణ భావోద్వేగ స్పందన వ్యక్తం చేశారు. అమరావతికి…

1 hour ago

పేలుడుతో చిద్రమైన ఇల్లు.. ఇద్దరు పిల్లలు బలి

మణిపూర్ రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలో ఒక నివాస గృహంపైకి అనుమానాస్పదంగా రాకెట్ దూసుకువచ్చి పేలడంతో…

2 hours ago