Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసింది ఈ సినిమా టాక్ పరంగా కాస్త మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్ పరంగా మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు ఈ సినిమా కోసం తాను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా అద్భుతంగా సాగుతున్నాయని మహేష్ బాబు తెలిపారు ఇక ఉగాది తర్వాత ఈ సినిమాకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ రాబోతుందని మహేష్ తెలిపారు.
ఇక తన కెరీర్ గురించి కూడా మాట్లాడుతూ ఈయన తన సినీ కెరియర్లో తన కెరీయర్ని మలుపు తిప్పిన సినిమాల గురించి కామెంట్లు చేశారు. తన కెరీర్లో మూడు సినిమాలు తన లైఫ్ మొత్తం మార్చేసాయని తెలిపారు. మురారి పోకిరి శ్రీమంతుడు సినిమాలని చెబుతాను.
రాజమౌళి సినిమాపై అప్డేట్..
ఇందులోని ప్రతి ప్రాజెక్ట్ లో ఓ భిన్నమైన స్టోరీ టెల్లింగ్ నేను చూశాను. అవి నన్ను ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేలా చేశాయనీ మహేష్ బాబు వెల్లడించారు. ఇక గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు మొదట్లో కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చిన అనంతరం ప్రేక్షకులను ఆకట్టుకుందని ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో కూడా దూసుకుపోతుందని మహేష్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారతీయ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటి రష్మిక మందన్న మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరవడానికి సిద్ధమవుతున్నారు. జపాన్ రాజధాని…
మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సంయుక్త మీనన్…
తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా, మోటోక్రాస్ నేపథ్యంతో వచ్చిన ‘బైకర్’ మాత్రం కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం…
టాలీవుడ్లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నిహారిక కొణిదెల తాజాగా తీసుకొచ్చిన చిత్రం ‘రాకాస’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.…
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తండ్రే తన కవల చిన్నారులను హత్య చేయడం స్థానికంగా తీవ్ర…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్లో ఆమోదం పొందిన తాజా బిల్లుతో అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించడంతో…