Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మరోవైపు కమర్షియల్ యాడ్ ద్వారా రెండు చేతుల భారీగా సంపాదిస్తున్నారు. ఇలా మహేష్ బాబు ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలాంటి బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడం కోసం ఈయన కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు.
ఈ విధంగా మహేష్ బాబు ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడానికి కారణం మరేది లేదు ఈయన తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు ఇతర మౌలిక వసతులను సమకూరుస్తున్నారు. అందుకోసమే ఈయన ఇలాంటి కమర్షియల్ యాడ్స్ చేస్తూ తన పౌండేషన్ కి విరాళంగా అందిస్తుంటారు.అయితే ఒక్కో యాడ్ కోసం కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే మహేష్ బాబు హిల్ ఎ చైల్డ్ అనే ఫౌండేషన్ కోసం ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నారు.
తాజాగా ఈ కార్యక్రమానికి మహేష్ బాబు నమ్రత దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే కాకుండా ఈ ఫౌండేషన్ ప్రమోట్ చేయడం కోసం ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది అయితే ఈ సంస్థ ద్వారా ఎంతో మంది చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి చికిత్స ఉచితంగా అందిస్తుంది.
ఈ క్రమంలోనే చిన్నారుల కోసం ఎంతో సేవ చేస్తున్నటువంటి ఈ ఫౌండేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి మహేష్ బాబు ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటారు.
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…