దేశ వ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి గురించి అధికారులు ఎంతో అవగాహన కల్పిస్తున్నారు.కరోనా బారిన పడిన వారు ఏమాత్రం ఆందోళన చెందకుండా కేవలం జాగ్రత్తలను పాటించడం వల్ల ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని అధికారులు పదే పదే చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం ఈ మహమ్మారి పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా గురించి ఈ విధమైనటువంటి అపోహల వల్ల ఓ పచ్చని కుటుంబం ముక్కలైపోయింది.
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి అతుల్ లాల్ భార్య తులికకి ఇటీవల కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తన భార్యకు పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆ భర్త భార్య పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించారు. పాజిటివ్ వచ్చిన తన భార్యకు చికిత్స చేయించడం కాకుండా భార్య అన్న జాలి కూడా లేకుండా ఆ భర్త ఆమెను రెండు ముక్కలు గా చేశాడు.
ఈ విధంగా తన భార్యను చంపడమే కాకుండా అతను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే పోలీసులు మాట్లాడుతూ కేవలం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతోనే ఇంత దారుణానికి పాల్పడినట్లు తెలిపారు.
కరోనా వైరస్ పై కొందరిలో అపోహలు ఏర్పడటం వల్ల ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కేవలం కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని మరోసారి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.
ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందిన రాశి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ను బిజీగా కొనసాగిస్తున్నారు. తాజాగా…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని ఆసక్తికర సంఘటనలు కాలానుగుణంగా మళ్లీ వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఓ అరుదైన విషయం తాజాగా…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన సుస్వాగతం సినిమా వెనుక ఆసక్తికరమైన విషయం తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా…
ప్రస్తుతం మార్కెట్లో కల్తీ ఆహారంపై పెరుగుతున్న ఆందోళన మధ్య, పాలు కూడా భద్రత పరంగా చర్చకు వస్తున్నాయి. పిల్లల నుంచి…
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడం అభిమానుల్లో…
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు దోష నివారణ పూజల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో…