దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సమయంలో కఠినమైన అంశాలను విధిస్తూ,అనవసరంగా బయట తిరిగితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది.
ప్రభుత్వాలు లాక్ డౌన్ పట్ల ఇంత కఠినమైన ఆంక్షలు పిలిచినప్పటికీ కొందరు మాత్రం అవేవీ తమకు పట్టనట్టుగా రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్నారు.మొదటి దశలో లాక్ డౌన్ విధించినప్పుడు హైదరాబాద్ లో ఒక వ్యక్తి గోధుమపిండి కోసం బయటకు వచ్చానని సమాధానం చెప్పడంతో అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ అయింది. ప్రస్తుతం అలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా పశ్చిమ బెంగాల్లోనూ లాక్ డౌన్ ఉన్న సమయంలో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ అధికారి అతడిని ఆపి బయట ఎందుకు తిరుగుతున్నావు? అని ప్రశ్నించగా అందుకు ఆ వ్యక్తి తన మెడలో స్వీట్స్ కొనడానికి అని రాసి ఉన్న బోర్డును చూపించాడు.
ఈ విధంగా ఆ వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కు సిల్లీ సమాధానం చెప్పడంతో.. “ఏంటి? స్వీట్స్ కొనడానికి బయటకు వచ్చావా.. పద ఇంటికెళ్ళు.. అంటూ గట్టిగా మందలించి పంపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు అతని ప్రవర్తన పట్ల విమర్శించగా మరికొందరు సమర్ధిస్తున్నారు. స్వీట్స్ కూడా నిత్యావసర జాబితాలోనే ఉంది. స్వీట్స్ కొనడానికి ప్రభుత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుమతి ఇచ్చింది కనుక ఆ సమయంలో అతను స్వీట్స్ కొనడానికి వస్తే తప్పేముంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…