సాధారణంగా కొందరు వ్యక్తులు అమ్మాయిలను బుట్టలో వెయ్యడానికి ఎన్నో మాయమాటలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే మాటలతో వారిని నమ్మించి మోసం చేసి వారి సరదాగా తీర్చుకొని అమ్మాయిలను మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలోని ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. చిన్నప్పటి ప్రేమ అంటూ తన భార్యకు విడాకులు ఇచ్చేస్తానని ఓ యువతిని నమ్మించి ఆమె పై అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు…
సందీప ప్రసాద్ అనే వ్యక్తికి ఐదు సంవత్సరాల క్రితమే వివాహమైంది. అతడికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఐదు సంవత్సరాల తర్వాత ఒక ఐటీ రిక్రూట్ కంపెనీలో పని చేస్తున్నటువంటి యువతిని కలిసిన సందీప్ తనని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నానని, తనకోసం తన భార్యకి కూడా విడాకులు ఇచ్చేస్తానని, తనని పెళ్లి చేసుకోవాలంటూ ఆమె వెంట పడుతున్నాడు. ఈ విషయంలో తాను ఒప్పుకోక పోతే చివరికి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆ యువతి ఈ ఏడాది జనవరిలో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత రెండు నెలల పాటు అంతా సవ్యంగానే ఉంది.ఆ తరువాత హైదరాబాద్ నుంచి బెంగళూరు కి వెళ్లిన సందీప్ తనని కూడా అక్కడికే రావాలని, లేకపోతే పెళ్లి ఫోటోలను తన తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనే బెంగళూరుకు వచ్చిన యువతి తనను ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను కుషాయిగూడ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు.
ఈ సమయంలోనే సందీప్ ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అదేవిధంగా సందీప్ కుటుంబ సభ్యులు తను సందీప్ ను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని పోలీసులు ఎదుట చెప్పాలని బెదిరించారు. ఈ విధంగా చిన్నప్పటినుంచి ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి తనని పెళ్లి చేసుకుని తనపై అత్యాచారానికి పాల్పడడంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…