Manoj Bajpayee comments on Bollywood : బాలీవుడ్ లో ప్రస్తుతం సౌత్ సినిమాల హవా బాగా నడుస్తోంది. అప్పుడు రాజమౌళి బాహుబలి సినిమా తో టాలీవుడ్లో చరిత్ర సృష్టించాడు. అయితే తాజాగా పుష్ప, ఆర్ఆర్ఆర్, KGF2 సినిమాలు బాలీవుడ్ లో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. హిందీ సినిమాలను పక్కకునెట్టి మరి సౌత్ సినిమాలు విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమాలో దెబ్బకి బడా బాలీవుడ్ సినిమాలు సైతం విడుదల తేదీని మార్చుకునే పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు అయినా కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్ లాంటివారు ఈ విషయం మీద స్పందించారు. అయితే తాజాగా మనోజ్ భాజపేయి ఈ విషయం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి….
సౌత్ సినిమాలైన ఆర్ఆర్ఆర్ కే జి ఎఫ్ 2 సినిమాలు అవలీలగా 300కోట్లను రాబట్టాయి. అయితే అక్కడి హిందీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రాబట్టడానికి కింద మీద పడుతున్నాయి. ఈ విషయంగా మనోజ్ భాజపేయి ఢిల్లీ టైమ్స్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు…. ఈ మధ్యకాలంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు వచ్చాయి. ఇది చూసి బాలీవుడ్ భయపడి పోతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితి చూసి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది బాలీవుడ్. ఒకరకంగా చూస్తే ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్ కి గుణపాఠం నేర్పింది.
ప్రస్తుతం సౌత్ నుంచి వచ్చి ఘన విజయాలు సాధించిన పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలను చూస్తే ప్రతి సీన్ అద్భుతంగా రావాలి అని పట్టుదలతో తీసినట్టు కనిపిస్తుంది. కానీ బాలీవుడ్లో ఈ పట్టుదల బాక్సాఫీస్ కలెక్షన్ల మీద మాత్రమే ఉంటుంది. సౌత్ సినిమా వాళ్ళు సినిమాను ఒక ఫ్యాషన్ గా చూస్తూ అంకిత భావంతో సినిమాని తీస్తారు. ప్రస్తుతం సౌత్ సినిమాల విజయాలను చూస్తుంటే బాలీవుడ్ వెన్నులో వణుకు పుడుతోంది. ఖచ్చితంగా దీన్ని చూసి బాలీవుడ్ కొంతయినా నేర్చుకోవాలి అని మనోజ్ బాజ్ పేయి తన అభిప్రాయాలను తెలియ చేశాడు.
వేసవి కాలంలో దాహం ఎక్కువగా ఉండటం సహజం. అందుకే ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే “అధికం…
ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, రెడీమేడ్ ఆహారాలకు అలవాటు పడుతున్న తరుణంలో సంప్రదాయ వంటకాల ప్రాముఖ్యత మళ్లీ పెరుగుతోంది. ఆరోగ్యాన్ని…
ఆరోగ్యకరమైన జీవనశైలికి సరైన ఆహారం కీలకం. చిన్న మార్పులతోనే పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది…
నరసింహ జయంతి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటిగా భావించబడుతుంది. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంగా అవతరించిన రోజుని…
భక్తి మార్గంలో నడిచిన మహానుభావుల కథలు ఎప్పటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అలాంటి అరుదైన భక్తురాళ్లలో తరిగొండ వెంగమాంబ ఒకరు.…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాటిలో బుధుడు ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడతాడు. బుద్ధి, వ్యాపారం, సంభాషణలకు…