Political News

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై కీలక చర్చకు రంగం సిద్ధం!

గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరుగనుంది. ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలకు, ప్రధాన కార్యదర్శులకు జలశక్తి శాఖ ఇప్పటికే సమాచారం పంపింది.

Meeting of CMs of Telugu states.. Key discussion on Godavari-Banakacharla project

ఏపీ ప్రభుత్వం ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టును ప్రధాన అజెండాగా ప్రతిపాదించింది. కాగా, తెలంగాణ మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రాజెక్టును చర్చలో పెట్టకూడదని స్పష్టం చేసింది. పైగా బనకచర్లకు ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేవని, ట్రైబ్యునల్ తీర్పులను ఉల్లంఘిస్తూ అభివృద్ధి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చ జరగడం అనుచితమని పేర్కొంటూ, ఈ ప్రాజెక్టుపై ఆమోదముద్ర వేయవద్దని కేంద్రాన్ని కోరింది.

తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న దిండి, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం స్వయంగా చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని, 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు తీసుకురావాలని ప్రతిపాదించింది.

రాష్ట్రాల మధ్య జలవివాదాలు, కొత్త ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఏర్పడే ఎపెక్స్ కౌన్సిల్‌నే అసలు వేదికగా పేర్కొంది. గత పదేళ్లలో ఈ కౌన్సిల్ కేవలం రెండు సార్లే సమావేశమైంది. కాగా, తాజా భేటీలో భిన్న అభిప్రాయాల నేపథ్యంలో, కేంద్రం దశలవారీ చర్చలకు మార్గం వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇద్దరు సీఎంల హాజరుతో జరగబోయే ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జలవివాదానికి ఒక కీలక మలుపు కావొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

telugudesk

Recent Posts

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

6 hours ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

6 hours ago

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

11 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

12 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

12 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

12 hours ago