Megastar Chiranjeevi: సినిమా టికెట్ల వ్యవహారంపై చిరంజీవి ట్వీట్..!
Megastar Chiranjeevi: ఏపీలో టికెట్ ధరల రచ్చ సద్దుమనగడం లేదు. ఈ టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య గ్యాప్ పెంచుతోంది. అయినా కూడా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో వెనక్కి తగ్గదేలే అంటూ వ్యవహరిస్తుంది జగన్ సర్కార్. గతంలో పవన్ కళ్యాణ్ నేరుగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. తాజాగా నాని శ్యాం సింగరాయ్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉన్నాయంటూనే.. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమాన పరిచారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ మంత్రులు కూడా తీవ్రంగానే స్పందించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్లు పెంచుకునేందకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై టాలీవుడ్ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి కృతఙ్ఞతలు.
సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’ అని చిరంజీవి ట్విట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ ధరలపై పూర్తి వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ టాలీవుడ్ కు పూర్తి ప్రెండ్లీగా వ్యవహరిస్తుంటే… జగన్ సర్కార్ తో టాలీవుడ్ కు గ్యాప్ క్రియేట్ అవుతోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…