Mohanbabu Family: వారిపై కేసు పెట్టిన మోహన్ బాబు ఫ్యాన్స్.. ఎందుకంటే..!
Mohanbabu Family: మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన మోహన్ బాబు ‘ సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ప్లాప్ కు కారణం ఈ ట్రోలింగే అంటూ.. మంచు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇటీవల ట్రోలింగ్ పై కూడా మంచు మోహన్ బాబు స్పందించారు. ఓ ఇద్దరు హీరోలు పనికట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఈ కామెంట్ల గురించి కూడా చివరకు ట్రోలింగ్ చేశారు.
ఇటీవల మోహన్ బాబు, మంచు విష్ణు ట్రోలర్స్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంచు ఫ్యామిలీ కూడా చాలా సీరియస్ అయింది. అయితే.. తాజాగా మోహన్ బాబు ఫ్యాన్స్ మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్న వారి పై కేసు నమోదు చేశారు
శ్రీ మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి.. తిరుపతి అర్బన్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో కేసు నమోదు చేశారు. ఆయన మాట్లాడుతూ…‘గత 20 ఏళ్లుగా మోహన్ బాబుగారి ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ గా ఉన్నాను. ఎప్పుడు కూడా మోహన్ బాబు ఫ్యాన్స్ వేరే హీరోలపై కామెంట్స్ చేయలేదు. మోహన్ బాబు ఇటీవల నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుండి కొంతమంది ట్రోలర్స్ మంచు కుటుంబం పై తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. 1, 2 కాదు 100 పైగా యూట్యూబ్ ఛానల్స్ వారు సినిమా రిలీజ్ ముందే సినిమా బాగాలేదని ట్రోల్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశాం’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…