Mokshagna: నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈయన చాలా ఆలస్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సరైన కథ డైరెక్టర్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. హనుమన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకోలేదు అలాగే సినిమా ఇంకా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాలేదు కానీ ఈయన రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పూజ కార్యక్రమాలు డిసెంబర్ ఐదో తేదీ ఎంతో ఘనంగా జరగబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం లేదు.
ఇలా డిసెంబర్ ఐదవ తేదీ పూజా కార్యక్రమాలను జరుపుకొని వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత మరో డైరెక్టర్ ను మోక్షజ్ఞ లైన్లో పెట్టారని తెలుస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరో అనే విషయానికొస్తే ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నటువంటి డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో మోక్షజ్ఞ తన రెండో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.
సార్ , లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న వెంకీ అట్లూరి నందమూరి హీరోతో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సిందే.
ఇంట్లో వాడిన తర్వాత మిగిలిపోయే చిన్న సబ్బు ముక్కలను చాలామంది వృథా చేసేస్తారు. కానీ, ఈ చిన్న ముక్కలతో ఎన్నో…
ఇంటి వంటలో గ్యాస్ స్టవ్ ఒక కీలక పరికరం. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వంట పనులు సజావుగా…
టాలీవుడ్లో తనదైన హాస్యం, రచనతో గుర్తింపు పొందిన ఎల్బీ శ్రీరామ్ తాజాగా దర్శకుడు వి.వి. వినాయక్తో ఉన్న తన అనుబంధాన్ని…
తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక అరుదైన పేరు కృష్ణవేణి. నేటి తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోయినా, ఒకప్పుడు…
టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ తాజాగా తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా…
హర్యానాలోని గురుగ్రామ్లో నడిరోడ్డుపై జరిగిన ఓ విచిత్ర ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు తమ ఎస్యూవీ కార్లతో…