Mokshagna: బాలయ్య వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక రెండవ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ఈ సీజన్ కి హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ఆహా ప్రసారం చేయనుంది. అదేవిధంగా ఈ సీజన్ క్లైమాక్స్ ఎపిసోడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు.
ఇక ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కావడంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తి కావడంతో ఈ షో కి సంబంధించిన కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. దీంతో ఈ కార్యక్రమం పై మరిన్ని అంచనాలు కూడా పెరిగిపోయాయి.
ఈ క్రమంలోనే ప్రభాస్ షోలో బాలకృష్ణ రామ్ చరణ్ కు ఫోన్ చేసిన విధంగానే పవన్ కళ్యాణ్ షోలో కూడా బాలకృష్ణ రామ్ చరణ్ కి ఫోన్ చేసి మాట్లాడారని సమాచారం. అదేవిధంగా ఈ షో కోసం మధ్యలో డైరెక్టర్ క్రిష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా హాజరయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్యతో కలిసి పవన్ తొడ కొట్టారనే వార్తలు వినపడుతున్నాయి.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ షూటింగ్ లాస్ట్ లో మోక్షజ్ఞ వేదిక పైకి వచ్చి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగారని తెలియడంతో మోక్షజ్ఞకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టమా అని అభిమానులు భావిస్తున్నారు. అయితే మోక్షజ్ఞ రావడాన్ని ఎపిసోడ్ లో బహుశా చూపించకపోవచ్చని తెలుస్తుంది.మోక్షజ్ఞ పవన్ కళ్యాణ్ పై అభిమానంతో వ్యక్తిగతంగా తనతో ఫోటో దిగడానికి వచ్చారు కనుక ఈ సన్నివేశాలు ఈ కార్యక్రమంలో ఉండవని భావిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…