జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఇది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఎంతో కాలంగా హిట్ సినిమా లేక.. కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన బొమ్మరిల్లు భాస్కర్ కు ఇది మంచి విజయం సాధించడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
అటు అఖిల్ కూడా ఈ విజయాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. దీనిలో అతడి స్పీచ్ ఎంతగానో ఆకట్టుకుంది. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తగ్గేదేలే అంటూ స్పీచ్ స్టార్ట్ చేశాడు.
ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. రాబోయే కొన్ని తరాల వాళ్లు కూడా ఈ సినిమాను తొంగి చూసే విధంగా భాస్కర్ రూపొందించాడని.. ఎంతో అద్భుతంగా సినిమా వచ్చిందన్నారు. అన్ని తరాల వాళ్లు నచ్చేలా.. మెచ్చేలా ఈ సినిమా ఉందన్నారు. అక్కినేని ఫ్యామిలీతో తమ ఫ్యామిలీ బంధం ఈ నాటిది కాదని.. 65 ఏళ్ల బంధం అంటూ చెప్పాడు.
ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన పూజా గురించి మాట్లాడుతూ.. మా డార్లింగ్ అంటూ సంబోధిస్తూ.. ఈ సినిమాలో చించేసింది అన్నాడు. ఆమె సినీ కెరీర్ లో ఇదో పెద్ద సస్సెషనల్ హిట్ గా నిలిచిపోయిద్ది అన్నాడు. ఇంకా ఇటువంటి చిత్రాలు మరెన్నో రూపొందించాలంటూ అతడు ఆమెను ప్రశంసల వర్షంలో ముంచెత్తాడు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…