Nandigam Suresh: తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి నేతలలో భయం పట్టుకుంది అంటూ ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ రావడంపై ఏపీలో ఎవరికీ ఎలాంటి ఆందోళన లేదంటూ వైఎస్ఆర్సిపి నేతలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాప్తాడు నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర చేశారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ నందిగాం సురేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సురేష్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడుకి పక్కవారి బిడ్డలను ఎత్తుకోవడం బాగా అలవాటైందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణలో 8 చోట్ల పోటీ చేయక స్వతంత్ర అభ్యర్థి శిరీషకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు అంటూ ఎద్దేవా చేశారు.
ఇక లోకేష్ తన రెడ్ బుక్ పట్టుకొని తిరిగే పాదయాత్రకు వస్తున్నారు. ఆయన ఆ బుక్ లో ఎవరి పేరు రాశారో తెలియదు కానీ ఏపీ ప్రజలు మాత్రం పవన్, లోకేష్ చంద్రబాబు పేర్లను రాసుకున్నారని తెలియజేశారు. రాప్తాడు అంటేనే ఒకప్పుడు ఫ్యాక్షన్లకు మారుపేరు. ఇప్పుడు ఎవరి పని వారు స్వేచ్ఛగా చేసుకుంటున్నారు ఫ్యాక్షన్ కి తావు లేకుండా ప్రకాష్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారంటూ ప్రకాష్ రెడ్డి పై సురేష్ ప్రశంసలు కురిపించారు.
రాప్తాడులో కనిపించని ఫ్యాక్షన్…
ఇక కొంతమంది టిడిపి నేతలు జగన్ గురించి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నికలలో ఓడిస్తామని ఆయనని అధికార పీఠం నుంచి దింపి అండమాన్ పంపిస్తామంటూ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే ధైర్యం ఆయనని బెదిరించే దమ్ము ధైర్యం ఎవరికీ లేవు అంటూ ఈ సందర్భంగా తనదైన స్టైల్ లో సురేష్ మాస్ వార్నింగ్ ఇస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…