Nandigam Suresh: తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి నేతలలో భయం పట్టుకుంది అంటూ ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ రావడంపై ఏపీలో ఎవరికీ ఎలాంటి ఆందోళన లేదంటూ వైఎస్ఆర్సిపి నేతలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాప్తాడు నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర చేశారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ నందిగాం సురేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సురేష్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడుకి పక్కవారి బిడ్డలను ఎత్తుకోవడం బాగా అలవాటైందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణలో 8 చోట్ల పోటీ చేయక స్వతంత్ర అభ్యర్థి శిరీషకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు అంటూ ఎద్దేవా చేశారు.
ఇక లోకేష్ తన రెడ్ బుక్ పట్టుకొని తిరిగే పాదయాత్రకు వస్తున్నారు. ఆయన ఆ బుక్ లో ఎవరి పేరు రాశారో తెలియదు కానీ ఏపీ ప్రజలు మాత్రం పవన్, లోకేష్ చంద్రబాబు పేర్లను రాసుకున్నారని తెలియజేశారు. రాప్తాడు అంటేనే ఒకప్పుడు ఫ్యాక్షన్లకు మారుపేరు. ఇప్పుడు ఎవరి పని వారు స్వేచ్ఛగా చేసుకుంటున్నారు ఫ్యాక్షన్ కి తావు లేకుండా ప్రకాష్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారంటూ ప్రకాష్ రెడ్డి పై సురేష్ ప్రశంసలు కురిపించారు.
రాప్తాడులో కనిపించని ఫ్యాక్షన్…
ఇక కొంతమంది టిడిపి నేతలు జగన్ గురించి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నికలలో ఓడిస్తామని ఆయనని అధికార పీఠం నుంచి దింపి అండమాన్ పంపిస్తామంటూ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే ధైర్యం ఆయనని బెదిరించే దమ్ము ధైర్యం ఎవరికీ లేవు అంటూ ఈ సందర్భంగా తనదైన స్టైల్ లో సురేష్ మాస్ వార్నింగ్ ఇస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…