Mr. Tea Naveen Reddy : రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన ఒక కిడ్నాప్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా లెవెల్లో వందమందితో వచ్చి అడ్డొచ్చిన వారిని కొట్టి ఆ ఇంటివద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నానా హంగామా చేసి యువతిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కానీ ఈ కిడ్నాప్ విషయంలో లోతుకి వెళితే అక్కడే మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక కిడ్నాప్ చేయించిన నవీన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. దౌర్జన్యంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసారని తొలుత భావించినా నిజానికి ఆ అమ్మాయికి నవీన్ రెడ్డికి అంతకుముందు ప్రేమ వ్యవహారం ఉందంటూ ఆ అమ్మాయికి కాస్ట్లి కారు గిఫ్ట్ ఇచ్చాడు అంటూ బయట ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరొక ట్విస్ట్ ఈ ఇష్యూలో బయట పడింది.
మహిళ దుస్తులు… ఓయో రూమ్ బుకింగ్…
కిడ్నాప్ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. నవీన్ రెడ్డి ని అరెస్టు చేశారు పోలీసులు అని కొందరు చెబుతుంటే మరో వైపు నవీన్ రెడ్డి పారారీలో ఉన్నాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. నవీన్ రెడ్డి కిడ్నాప్ అనంతరం ప్రయాణించిన కారులో ఒక మహిళ దుస్తులు ఉన్న బ్యాగ్ దొరకడం, ఇక ఓయో రూమ్ బుక్ చేసినట్లు మళ్ళీ అది చెక్ అవుట్ చేసినట్లు పోలీసులు వెతికిన ఆధారాల్లో లభ్యమైంది. అయితే నవీన్ ను గోవా లో పట్టుకున్నట్లు ప్రస్తుతం వినిపిస్తోంది. వైశాలిని కిడ్నాప్ చేసి మూడు రోజులు తనతో ఉండాల్సిందిగా తెలిపాడు.
ఆ అమ్మాయి ఏడ్చి ఒప్పుకోక పోవడంతో మార్గమధ్యలోనే వదిలి వెళ్ళాడు అంటూ వార్తలు వినిపిస్తున్నా నిజానిజాలు తెలియయాల్సి ఉంది. కాగా తాజాగా నవీన్ కి సంబందించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. అందులో అందరూ వైశాలి వైపు మాట్లాడుతున్నారు నాకు జరిగిన అన్యాయం గురించి ఏంటి అంటూ మాట్లాడటం, నా స్థానంలో ఒక అమ్మాయి ఉంటే ఇలానే మాట్లాడేవారా అంటూ మాట్లాడిన వీడియో ఒకటి హల్చల్ చెస్తోంది. మొత్తానికి పూటకో ట్విస్టు తో సాగుతున్న నవీన్ రెడ్డి వైశాలి రెడ్డి ఇష్యూలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం కష్టమే…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…