Mrunal Thakur: పలు బాలీవుడ్ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మృణాల్ ఠాకూర్ అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకున్నారు ఇలా బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె హనురాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మృణాల్ ఠాకూర్ అనంతరం నాని సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకునే మృణాల్ తాజాగా తన మనసులో కోరికను బయటపెట్టారు.
ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నాకు ఒక పెద్ద కల ఉందని తెలిపారు. అయితే ఆకల నెరవేరాలని ప్రతిరోజు తాను కోరుకుంటున్నానని తెలిపారు.మరి ఈమె ఆ కోరిక కళ ఏంటి అనే విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తనకు మహేష్ బాబుతో నటించడం ఒక డ్రీమ్ గా మారిందని మృణాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈమె కల నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…