Mukesh Ambani: మెగా వారసురాలు బారసాలు వేడుక నేడు ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీనితో నేడు మెగా వారసురాలిని పరిచయం చేయబోతున్నారని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రామ్ చరణ్ ఉపాసనలకు 10 సంవత్సరాలు తర్వాత కూతురు పుట్టడంతో ప్రతి వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బారసాల వేడుకను అత్యంత కనుల పండుగగా జరిపించబోతున్నారని సమాచారం. ఈ బారసాల వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు ఇతర బంధువులు అత్యంత సన్నిహితులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఇక నేడు బారసాల వేడుకను నిర్వహించడంతో పెద్ద ఎత్తున మెగా ప్రిన్సెస్ కోసం కానుకలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఏకంగా బంగారపు ఉయ్యాల కానుకగా పంపించారని తెలుస్తోంది. ఇలా రామ్ చరణ్ కుమార్తె కోసం ముఖేష్ అంబానీ బంగారంతో తయారు చేసిన ఊయలను పంపించారన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ చిన్నారి కోసం దాదాపు రెండు కిలోలకు పైగా బంగారం ఉపయోగించి ఈ ఊయల తయారు చేశారని సమాచారం. మరి ఈ ఊయల కోసం ఏకంగా 1.20 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని తెలుస్తోంది. కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయినటువంటి ముఖేష్ అంబానీ ఇలా రాంచరణ్ కూతురి కోసం బంగారపు ఊయల పంపించడంతో రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.
చికెన్ అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా ఫ్రైడ్, గ్రిల్డ్ వంటకాలలో కోడి చర్మంతో తినడం కొందరికి మరింత…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…
టాలీవుడ్, కోలీవుడ్లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…