Naga Chaitanya: నాగచైతన్య తాజాగా అమీర్ ఖాన్ కరీనాకపూర్ జంటగా నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా ఈ సినిమాలో నాగచైతన్య బాలరాజు అనే పాత్రలో సందడి చేశారు. ఈ పాత్రలో నటించిన ఈయన నటనకు ప్రశంసలు అందడంతో వరుసగా బాలీవుడ్ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఇలా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న నాగచైతన్య తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే గతంలో తాను గర్ల్ ఫ్రెండ్ తో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాను అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తాను తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కారు బ్యాక్ సీట్లో కూర్చుని తనకు ముద్దు పెట్టబోతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని తెలిపారు. ఇలా గర్ల్ ఫ్రెండ్ తో పోలీసులకు దొరికిపోయానని నాగచైతన్య చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ విధంగా గర్ల్ ఫ్రెండ్ కు ముద్దు పెట్టడం తనకు దృష్టిలో తప్పు విషయం కాదంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా నాగచైతన్య తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందనే విషయాన్ని చెప్పారు కానీ ఆమె ఎవరు తన పేరు ఏంటి అనే విషయం మాత్రం బయట పెట్టలేదు. మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ గురించి ఈ విధంగా నాగచైతన్య ఓపెన్ కావడం గమనార్హం.
ఇకపోతే ఇదివరకు నాగచైతన్య ఎక్కడ ఎలాంటి ఇంటర్వ్యూలలో కూడా పెద్దగా పాల్గొనేవారు కాదు. ఒకవేళ ఇంటర్వ్యూలకు హాజరైన కేవలం సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే ప్రస్తావించేవారు. ఎక్కడ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే వారు కాదు. అయితే సమంతతో విడాకుల తర్వాత తాను వ్యక్తిగతంగా కూడా చాలా మారిపోయానని ఒకానొక సందర్భంలో నాగచైతన్య వెల్లడించిన విషయం మనకు తెలిసిందే.
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…