Nara Lokesh: ఆ పత్రిక పై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన నారా లోకేష్! కారణం అదేనా?
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం విశాఖపట్నం వెళ్లారు. అయితే గతంలో తన గురించి ఓ వార్తాపత్రిక అసత్య వార్తలను ప్రచారం చేయడంతో ఆయన ఈ విషయం పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు స్వయంగా నారా లోకేష్ హాజరయ్యారు.
గురువారం ఈ విచారణకు హాజరైన లోకేష్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్ గతంలో తను ప్రజాధనంతో 25 లక్షల విలువచేసే చిరుతిండ్లను తిన్నారని ప్రముఖ వార్తా పత్రిక అసత్య వార్తలను ప్రచారం చేయడమే కాకుండా మరో
మేగజీన్ కూడా ఇదే తరహా కథనాలను రా సాయి అని లోకేష్ తెలియజేశారు.
ఆ విషయం పై ఆధారాలతో సహా వాస్తవాలను తెలియజేయడంతో సదరు మేగజీన్ తనకు క్షమాపణలు చెప్పిందని తెలియజేశారు. అయితే మరొక పత్రికఇప్పటివరకు తన వివరణను ప్రచురించలేదని ఈ క్రమంలోనే ఆ పత్రికపై నారా లోకేష్ 75 కోట్ల పరువు నష్టం దావా వేసి నట్లు వెల్లడించారు.
ఇక ఈ కేసు గత కొన్ని నెలల నుంచి విచారణ జరుగుతోందని, ఈ కేసు విచారణ పూర్తి కాకుండా కొందరు ఉద్దేశపూర్వకంగానే అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఈ కేసు మాత్రం ఈనెల 28వ తేదీలోగా పూర్తిచేయాలని ప్రధాన న్యాయమూర్తి భావిస్తున్నారని లోకేష్ మీడియాకు తెలియజేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…