Nara Lokesh: ఆ పత్రిక పై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన నారా లోకేష్! కారణం అదేనా?
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం విశాఖపట్నం వెళ్లారు. అయితే గతంలో తన గురించి ఓ వార్తాపత్రిక అసత్య వార్తలను ప్రచారం చేయడంతో ఆయన ఈ విషయం పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు స్వయంగా నారా లోకేష్ హాజరయ్యారు.
గురువారం ఈ విచారణకు హాజరైన లోకేష్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్ గతంలో తను ప్రజాధనంతో 25 లక్షల విలువచేసే చిరుతిండ్లను తిన్నారని ప్రముఖ వార్తా పత్రిక అసత్య వార్తలను ప్రచారం చేయడమే కాకుండా మరో
మేగజీన్ కూడా ఇదే తరహా కథనాలను రా సాయి అని లోకేష్ తెలియజేశారు.
ఆ విషయం పై ఆధారాలతో సహా వాస్తవాలను తెలియజేయడంతో సదరు మేగజీన్ తనకు క్షమాపణలు చెప్పిందని తెలియజేశారు. అయితే మరొక పత్రికఇప్పటివరకు తన వివరణను ప్రచురించలేదని ఈ క్రమంలోనే ఆ పత్రికపై నారా లోకేష్ 75 కోట్ల పరువు నష్టం దావా వేసి నట్లు వెల్లడించారు.
ఇక ఈ కేసు గత కొన్ని నెలల నుంచి విచారణ జరుగుతోందని, ఈ కేసు విచారణ పూర్తి కాకుండా కొందరు ఉద్దేశపూర్వకంగానే అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఈ కేసు మాత్రం ఈనెల 28వ తేదీలోగా పూర్తిచేయాలని ప్రధాన న్యాయమూర్తి భావిస్తున్నారని లోకేష్ మీడియాకు తెలియజేశారు.
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…
మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…
ఆహారంలో రంగు, వాసన కోసం మాత్రమే ఉపయోగించే కుంకుమపువ్వు నిజానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు.…