Nayanatara : సినిమా పరిశ్రమలో ఎవరు ఎవరితో పరిచయం పెంచుకుంటారో, ప్రేమించుకుంటారో చెప్పడం కష్టం. సినిమాల్లో అయితే హీరోలనే హీరోయిన్లు మాత్రమే ప్రేమిస్తారు. కానీ నిజ జీవితంలో హీరోలు హీరోయిన్లనే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇక కొంత మంది హీరోలు తమతో నటించిన హీరోయిన్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగార్జున అమల, సూర్య జ్యోతిక, నేడు అది పినిశెట్టి, నిక్కీ గల్రానీ అలా ఉన్నా కొంత మంది జంటలు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుని వీడిపోయారు. ఇక కొంత మంది హీరోయిన్లు మాత్రం దర్శకుల ప్రేమలో పడ్డారు.
రోజా, రమ్య, ఇపుడు నయన…..
సుహాసిని మణిరత్నం తెలుగు నాట మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్. రొమాంటిక్ క్లాసిక్ ప్రేమ కథ చిత్రాల దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకుంది. ఇక మన తెలుగింటి అందం రోజా కూడా తమిళ దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రోజా ఎక్కువ చిత్రాలు సెల్వమణి దర్శకత్వంలో చేసింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇక ఈ జాబితాలో చేరిన మరో జంట ఖుష్బు సుందర్. రాఘవేంద్రరావు దర్శకత్వంలోని కలియుగ పాండవులు సినిమాలో పరిచయమైన ఖుష్బు తమిళ దర్శకుడు సుందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక రమ్య కృష్ణ కూడా దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే రమ్య కృష్ణ తమిళ అమ్మాయి, కృష్ణ వంశీ తెలుగు దర్శకుడు కావడం విశేషం.
నయన, విగ్నేష్ శివన్…..
ఇక ఇపుడు తమిళ లేడీ సూపర్ స్టార్ నయన తార, విగ్నేష్ శివన్ లు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. నయనతార ఇంతకుముందు హీరో శింబుతో ప్రేమాయణం నడిపింది. ఆ తరువాత డాన్స్ మాస్టర్ ప్రభూ దేవా తో కూడా పెళ్లి వరకు వెళ్లినా అప్పటికే పెళ్ళైన ప్రభుదేవా తో ఆ తంతు బెడిసికొట్టింది. రెండు సార్లు ప్రేమ విఫలమైన నయన్ ఇపుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతులో ప్రేమలో ఉంది. జూన్ 9 న మహాబలిపురంలో అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో జరగనుంది. తమిళ యువకుడైన విగ్నేష్, కేరళ కుట్టిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక విగ్నేష్ నయన కన్నా ఏడాది చిన్నవాడు కావడం విశేషం. తోలుత వీరి పెళ్లి తిరుపతిలో జరుగుతుందని భావించినా నయనతార కోరిక మేరకు మహాబలిపురంలో జరుగుతోంది. నయన తార, విగ్నేష్ దర్శకత్వంలో పలు సినిమాలు చేసింది. లేటెస్ట్ గా కన్మని రాంబో ఖతిజ అను సినిమాను విగ్నేష్ డైరెక్షన్ లో నయన తార చేసింది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…