Nayanatara -Vignesh Shivan: దక్షిణాది సిని ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నయనతార చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఈమె చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో కూడా నయనతార నటిస్తున్నారు.
ఈ సినిమా ఇప్పటికి విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది అయితే సెప్టెంబర్ 7వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఇందులో నయనతార కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చేతిలో గన్ పట్టుకొని ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నారు. ఇక ఈ ఫోటోని విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నయనతారపై ప్రశంశల వర్షం కురిపించారు. షారుక్ ఖాన్ అభిమానిగా ఆయన అన్ని సినిమాలు చూస్తూ వచ్చావు అయితే ప్రస్తుతం ఆయనతోనే కలిసి ప్రధాన పాత్రలో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
నిన్ను ఇలా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నువ్వు ఎందరికో స్ఫూర్తిగా నిలిచావు. నిన్ను చూస్తుంటే నేను మాత్రమే కాకుండా మన ఫ్యామిలీ మొత్తం ఎంతో గర్వపడుతుంది అంటూ విగ్నేష్ నయనతార పట్ల ప్రశంశలు కురిపిస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ హీరోగా నటించగా విలన్ పాత్రలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…