Rajinikanth: టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు రజినీకాంత్. అంతేకాకుండా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు రజనీకాంత్. ఇక రజనీకాంత్ చివరగా జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే..
సూపర్స్టార్ రజనీకాంత్తో లేడీ సూపర్స్టార్ నయనతార మరోసారి జత కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆయన అతిథి పాత్ర పోషించిన లాల్ సలాం చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన తెరపైకి రానుంది. ఆయన పెద్దకూతురు ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. కాగా ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మలయాళం స్టార్ హీరోయిన్ మంజు వారియర్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా రజనీకాంత్ తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.
రజనీకాంత్ సరసన లేడీ సూపర్ స్టార్..
ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం కానుంది. కాగా రజనీకాంత్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్త తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈయన ఇంతకుముందు నటించిన జైలర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్ను దర్శకుడు నెల్సన్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన సరసన నటి నయనతార నటించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఈ జంట చంద్రముఖి, కథానాయకుడు, శివాజీ, దర్భార్, అన్నాత్తే మొదలగు ఐదు చిత్రాలలో కలిసి నటించింది. తాజాగా ఆరోసారి ఈ కాంబోలో చిత్రం రూపొందబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
పౌరాణిక కథలపై తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న…
టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ చిత్రాల్లో ఒకటైన రణబాలి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రేమపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. జీవితంలో…
టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ ప్రత్యేకమైన ప్రేమ కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. యవ్వనంలో…
టాలీవుడ్లో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రిద్ధి కుమార్. సహజమైన అందం, సింపుల్…
భారతదేశంలో దేవాలయాలకు వెళ్లినప్పుడు లడ్డూ, పులిహోర, పండ్లు వంటి సంప్రదాయ ప్రసాదాలు అందుకోవడం సాధారణం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని…