Neha Shetty: నేహా శెట్టి అంటే టక్కున గుర్తుకు రాకపోయినా డిజె టిల్లు హీరోయిన్ అంటే మాత్రం అందరికీ నేహా శెట్టి గుర్తుకు వస్తారు.రాధిక పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నేహా శెట్టి డీజే టిల్లు సినిమా ద్వారా గుర్తింపు పొందినప్పటికీ ఈమె ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చారు. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమా ద్వారా ఈమె తెలుగు తెలుగు హీరోయిన్గా పరిచయమయ్యారు.
ఈ సినిమా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో అనంతరం గల్లీ రౌడీ అనే సినిమాలో కూడా నటించారు. ఇలా వరుస సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు.ఇలా ఈ పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నేహా శెట్టి డిజె టిల్లు సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు.
ఈ సినిమాలు అమ్మడి నటనకు అందాల ఆరబోతకు ఎంతోమంది ఫిదా అయ్యారు.ఈ క్రమంలోని ఈమెకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తాయని అందరూ భావించారు కానీ ఈమె తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఉన్న ఫేమ్ కాస్త పోయింది. ఈమె డిజె టిల్లు వంటి సినిమా తర్వాత ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తప్పు నిర్ణయం తీసుకున్నారని పలువురు భావిస్తున్నారు. అయితే మరోసారి ప్రేక్షకులు తనని మర్చిపోకుండా ఉండడం కోసం ఈ ముద్దుగుమ్మ సరికొత్త ప్లాన్ చేశారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్లతో రెచ్చిపోతున్నారు. ఇలా అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఫోటోషూట్ చేయించుకోవడం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే దివాళి పండుగ సందర్భంగా యద అందాలను ఆరబోస్తూ బెడ్ పై ఈమె ఇచ్చిన హాట్ ఫోజులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ ఫోటోలు ద్వారా తాను ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలకైన సై అనేలా ఈమె ఫోటోషూట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…