Categories: FeaturedMovie News

Mohan Babu: ఏదైనా చెప్పినా నమ్మేలా ఉండాలి.. జడ్జిగారు పిలవడం ఏంటీ మీరెళ్ళడం ఏంటీ బాబు గారు?

Mohan Babu: తెలుగు చిత్ర పరిశ్రమంలో నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన హీరోగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా విద్యావేత్తగా కూడా ఎన్నో పాఠశాలలను కళాశాలలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఇకపోతే 2019వ సంవత్సరంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మోహన్ బాబు తన కుమారులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన విషయం మనకు తెలిసిందే.

Mohan Babu: ఏదైనా చెప్పినా నమ్మేలా ఉండాలి.. జడ్జిగారు పిలవడం ఏంటీ మీరెళ్ళడం ఏంటీ బాబు గారు?

ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మోహన్ బాబు కుమారులపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఈ కేసు జరుగుతూనే ఉంది. తాజాగా మంగళవారం మోహన్ బాబు తన కుమారులతో కలిసి తిరుపతి కోర్టుకు హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఈయన తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టుకు పాదయాత్రగా వెళ్లడంతో పెద్ద ఎత్తున మీడియం చుట్టుముట్టి ఈయనను పలు ప్రశ్నలు వేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు చెప్పాల్సిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏవేవో ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తిరిగి కోర్టు విచారణ వాయిదా ఎప్పుడు అని మీడియా ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ తనకు కోర్టు ఏ విధమైనటువంటి సమన్లు జారీ చేయలేదని కేవలం జడ్జిగారు పిలిస్తేనే తాను వెళ్లానని సమాధానం చెప్పారు.

సమన్లు జారీ చేయకుండానే సంతకం పెట్టారా…

ఇక మోహన్ బాబు చెప్పిన మాటల ప్రకారం జడ్జిగారు పిలవడం అంటే సమన్లు, లేదా నోటీసులు పంపడమే కదా అర్థం అంటూ పలువురు ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.అక్కడికేదో జడ్జిగారు మోహన్ బాబుని పిలిచి కుశల ప్రశ్నలు అడిగినట్లు ఈయన సమాధానం చెప్పారు అంటూ మరోసారి నేటిజన్ల మోహన్ బాబు కుటుంబం పై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఏదైనా చెప్పినా నమ్మేలా ఉండాలి మోహన్ బాబు గారు జడ్జి గారి పిలిస్తే వెళ్లి సంతకం పెట్టానని చెప్పడం ఏంటో అంటూ మరోసారి మంచు ఫ్యామిలీ పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago