Shiya Gowtham : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమా లో హీరోయిన్ గా వచ్చిన శియా గౌతమ్ మరో పేరు అధితి గౌతమ్. నేనింతే సినిమా తరువాత మళ్ళీ ఏడు ప్రేమకథలు, వేదం సినిమాలో నటించింది. ఆ తరువాత దాదాపుగా సినిమాల్లో కనిపించని శియా మళ్ళీ చాలా రోజుల తరువాత మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్ లో నటించింది.
నాగార్జున అంటే క్రష్ అండ్ లవ్…
ఇక తనకు నాగార్జున అంటే చాలా క్రష్ అని చెప్పింది శియా. చాలా రోజుల తరువాత ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న శియా రవితేజ చాలా ఫ్రెండ్లీ గా ఉంటారని కితాబిచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో ఆర్ ఆర్ఆర్ఆర్ చూసానని అందులో కొమరం భీముడో పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ను కొట్టే సన్నివేశంలో చాలా ఏడుపొచ్చిందని, ఇప్పటికి అది గుర్తుకుతెచ్చుకుంటే రొమాలు నిక్కబోడుచుకుంటాయని చెప్పింది.
ఇక అల్లు అర్జున్ గురించి అడుగగా స్టైలిష్ గా ఉంటారని ఇక రాజమౌళి గారితో, ప్రశాంత్ నీల్ తో పని చేయాలని ఉందని శియా తన మనసులోని మాటను చెప్పింది. ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాలో శియా నటించింది. ఇక ఈ సినిమా జులై 1న విడుదల కానుంది. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…