Shiya Gowtham : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమా లో హీరోయిన్ గా వచ్చిన శియా గౌతమ్ మరో పేరు అధితి గౌతమ్. నేనింతే సినిమా తరువాత మళ్ళీ ఏడు ప్రేమకథలు, వేదం సినిమాలో నటించింది. ఆ తరువాత దాదాపుగా సినిమాల్లో కనిపించని శియా మళ్ళీ చాలా రోజుల తరువాత మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్ లో నటించింది.
నాగార్జున అంటే క్రష్ అండ్ లవ్…
ఇక తనకు నాగార్జున అంటే చాలా క్రష్ అని చెప్పింది శియా. చాలా రోజుల తరువాత ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న శియా రవితేజ చాలా ఫ్రెండ్లీ గా ఉంటారని కితాబిచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో ఆర్ ఆర్ఆర్ఆర్ చూసానని అందులో కొమరం భీముడో పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ను కొట్టే సన్నివేశంలో చాలా ఏడుపొచ్చిందని, ఇప్పటికి అది గుర్తుకుతెచ్చుకుంటే రొమాలు నిక్కబోడుచుకుంటాయని చెప్పింది.
ఇక అల్లు అర్జున్ గురించి అడుగగా స్టైలిష్ గా ఉంటారని ఇక రాజమౌళి గారితో, ప్రశాంత్ నీల్ తో పని చేయాలని ఉందని శియా తన మనసులోని మాటను చెప్పింది. ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాలో శియా నటించింది. ఇక ఈ సినిమా జులై 1న విడుదల కానుంది. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…
మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…
ఆహారంలో రంగు, వాసన కోసం మాత్రమే ఉపయోగించే కుంకుమపువ్వు నిజానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు.…
హైదరాబాద్లో ప్రేమ పేరుతో జరిగిన ఓ దొంగతనం కేసు తాజాగా బయటకు రావడం సంచలనంగా మారింది. ప్రియుడికి బర్త్డే గిఫ్ట్…