జీవితంపై ఎన్నో ఆశలతో.. ఎంతో కలలు కని ఆమె అత్తారింట్లో అడుగుపెట్టింది. భర్తతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడపాలని అనుకుంది. కానీ అనూహ్యంగా ఆమె విగతజీవిగా కనిపించింది. అసలు ఏం జరిగిందంటే.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఓ తండాకు చెందిన పీనాబాయి జుక్కల్ మండలం దోస్త్పల్లి తండాకు చెందిన వీరేశంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. కానీ ఉన్నట్టుండి షీనబాయి మృతి చెందింది.
ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ప్రతీ ఒక్కరూ వివిధ రకాలుగా చెబుతున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమె కుటుంబసభ్యులు మాత్రం ఆమెది హత్య అని ఆరోపిస్తున్నారు.
షీనాబాయి మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అదనపు కట్నం కోసం తమ కూతురును విపరీతంగా చిత్రహింసలకు గురిచేసి చంపేశారని.. ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసమే అత్తింటి వారే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మృతురాలి కుటుంబ సబ్యులు, బంధువులు భారీగా జుక్కల్ పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరు కూడా ఇది హత్యే అంటూ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టు మార్టమ్ రిపోర్టు రాగానే నిజనిర్ధారణ చేసి నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…