Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నిహారిక పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అందుకు కారణం ఆమె భర్తకు దూరంగా ఉండటం. జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక గత కొంతకాలంగా అతనితో దూరంగా ఉంటూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నీహారిక ఏం చేసినా కూడా ఆసక్తికరంగా మారింది.
సోషల్ మీడియాలో నిహారిక షేర్ చేసే ఫోటోలను బట్టి ఆమె జీవితంలో జరిగే సంఘటనల గురించి అంచనాలు వేస్తున్నారు. జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న తర్వాత నిహారిక యాక్టింగ్ కి దూరంగా ఉంటూ నిర్మాణరంగం వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలో పలు వెబ్ సిరీస్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే.. వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా నిహారిక నటించిన డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ మరో నాలుగు రోజుల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం నిహారిక ఇంటర్వ్యూలలో పాల్గొంటు బిజిగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల నిహారిక షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నిహారిక మెడలో తాయత్తు ధరించి ఉండటంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అసలు నిహారిక ఇలా తాయత్తు ధరించటానికి కారణం ఏమిటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం నీహారిక తన కెరీర్ మీద దృష్టి పెట్టడం వల్ల తన వ్యక్తిగత విషయాల గురించి ఎలాంటి వార్తలు వినిపిస్తున్నప్పటికీ వాటి గురించి స్పందించటం లేదు. ఇక ఇటీవల పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నిహారిక ఇటీవల కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది. ఇలా తన భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో నిహారిక ఒక స్వామీజీ సూచనల ప్రకారం తాయత్తు ధరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలోచించడానికి నిహారిక సిద్ధమైంది. సినిమాలలో హీరోయిన్ గా సరైన సక్సెస్ అందుకోని నిహారిక ఈ వెబ్ సిరీస్ ల వల్ల అయిన నటిగా నిరూపించుకుంటుందో లేదో చూడాలి మరి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…