Akhil: అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు అఖిల్ నటించిన సినిమాలలో ఒక్కటి కూడా మంచి విజయం అందుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఏజెంట్ సినిమా కూడా అక్కినేని కుటుంబ సభ్యులను , అభిమానులను నిరాశపరిచింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలై అందరూ అంచనాలను తారుమారు చేసింది. ఈ సినిమాతో అఖిల్ అకౌంట్లో మరొక డిజాస్టర్ వచ్చి చేరింది. ఇదిలా ఉండగా ఏజెంట్ సినిమా డిజాస్టర్ గురించి తాజాగా అఖిల్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అఖిల్ షేర్ చేసిన ఈ నోట్ లో ” ఏజెంట్ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా తెరకెక్కించడంలో తమ జీవితాలను అంకితం చేసిన వారికి కూడా కృతజ్ఞతలు. ఒక మంచి సినిమా అందించాలని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. కానీ దురృష్టవశాత్తు మేము అనుకున్న స్థాయికి స్క్రీన్ పైకి తీసుకురాలేకపోయాం. ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని ఇవ్వలేకపోయాం అంటూ రాసుకొచ్చాడు.
అలాగే మూవీ మొదలు పెట్టిన్పటి నుంచి నాకు ఎంతో అండగా నిలిచిన నిర్మాత అనీల్ కు నా కృతజ్ఞతలు. అభిమానులు, శ్రేయోభిలాషులు చూపించే ప్రేమ , అభిమానం వల్లే నేను ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న అభిమానుల కోసం నేను మరింత దూరంగా సిద్ధమై ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తాను అంటూ నోట్ లో తెలియపరిచాడు. ప్రస్తుతం అఖిల్ షేర్ చేసిన ఈ నోట్ వైరల్ గా మారింది. అయితే అక్కినేని అభిమానులు కూడా అఖిల్ కి ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…