Nityananda Statue : నిత్యనంద స్వామి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ గా వుండే నిత్యానంద ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలిచేవారు. అయితే నవంబరు 2019లో భారతదేశం వదిలి నిత్యానంద అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. నిత్యానందను దేశంలో విమర్శించే వారితో పాటు పరమ శివుడు రూపం అంటూ దైవ భక్తితో మొక్కే వారు కూడా ఉన్నారు. తాజాగా ఈయనను దేవుడిగా భావించే ఒక భక్తుడు ఏకంగా నిత్యానందస్వామి 18 అడుగుల విగ్రహాన్ని నిర్మించాడు.
ఆలయానికి బాతుమలై మురుగన్ అని నామకరణం…
తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం కి చెందిన బాలసుబ్రమణ్యం అనే భక్తుడు తాను నమ్మిన నిత్యానంద స్వామికి 18 అడుగుల విగ్రహం నిర్మించి తనపై వున్న భక్తిని చాటుకున్నాడు. వారి గ్రామంలోని ఐశ్వర్య నగర్లో ఈ విగ్రహాన్ని స్థాపించి, ఈ ఆలయానికి ‘బాతుమలై మురుగన్’ అని నామకరణం కూడా చేశాడు. మలేసియాలో వున్న మురుగన్ ఆలయం లాగా 27 అడుగుల విగ్రహాన్ని నిర్మించి, ఆ మురుగన్ ఆలయ ప్రారంభంలోనే 18 అడుగుల నిత్యానంద స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుంభాభిషేకం కూడా జరిపించాడు. ఈ వేడుకకు పుదుచ్చేరి సీఎం రంగస్వామి, ఇతర మంత్రులను కూడా ఆహ్వానించగా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం హాజరు అవ్వడం జరిగింది.
ఇది ఇలా ఉండగా ఈ వేడుకకు వచ్చిన శివాచార్యులు మాత్రం శివుడి రూపంలో ఉన్న నిత్యానంద విగ్రహాన్ని చూసి ఇది నిత్యానంద విగ్రహం కాదని కాలభైరవుడిని రూపొందించగా సరైన రూపం రాక ఇలా వుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…